వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ సమావేశాల్లో ప్రకటించారు. ఇప్పటికే తాను రాయని, తాను సంతకం చేయని ఓ రాజీనామా లేఖ ఇంటర్ నెట్ లో దర్శనమిస్తోందని.. అందులో వాడిని తీవ్ర అభ్యంతరకర బాషను తీవ్రంగా ఖండించిన ఆమె.. తాను వెఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన షర్మిలకు మద్దతుగానే ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇక్కడ ఈ పార్టీలో కొనసాగుతూ అక్కడ ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తే అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని, అది తనకు ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలోనే తాను వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు,
తెలంగాణ కోడలుగా.. వైఎస్సార్ కూతురిగా.. వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ టీపీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుందన్నారు. ఎల్లో మీడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు. ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం దురదృష్టకరం. ఇద్దరి పిల్లలకు తల్లినే.. తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీ కంటే కూడా.. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి.
ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేర్వేరు విధానాలు ఉంటాయని’’ విజయమ్మ అన్నారు. ‘‘వైఎస్ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్నవారు జగన్, షర్మిల. నేను రాయని, చేయని సంతకంతో.. రాజీనామా లేఖ విడుదల చేశారు. ఇవి జుగుప్సకర రాతలు. ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసింది. నేను రాయని, నేను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారు?. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నానని’’.. ఇందుకోసమే తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు అమె ప్రకటించారు.
తన ఉనికి ఎవరికి వివాదస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం. ప్రజలకు తన ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతు తన ఇద్దరి బిడ్డలకు కావాలని అమె కోరారు. తల్లిగా జగన్కు ఎప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘నన్ను క్షమించమని వైఎస్ఆర్ అభిమానులను కోరుతున్నాను. రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదు. వైఎస్సార్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరు’ అని వైఎస్ విజయమ్మ అన్నారు. ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’’ అని విజయమ్మ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more