అమెరికాలో మరోమారు తూటాల పేలుళ్లు సంభవించాయి. దేశభక్తిని చాటేందుకు దేశప్రజలకు ఇచ్చే సెలవు దినమైన జూలై 4న షికాగోలో ఇల్లినాయిస్ పట్టణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్పై ఓ దుండగుడు అత్యంత దారుణంగా కాల్పులతో విరుచుకుపడ్డాడు. దేశ స్వాతంత్ర్య పరేడ్ లో పాల్గోని తమలోని దేశభక్తిని చాటిన ప్రజలపై రూఫ్ టాప్ గన్ తో విఛక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 36 మందికిపైగా గాయపడ్డారు. షికాగో శివారులోని ఇల్లినాయిస్ పట్టణంలోని హైలాండ్ పార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్వాతంత్ర్య పరేడ్లో నిమగ్నమై తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ పరేడ్ నిర్వహిస్తున్న వారిపై అత్యంత శక్తిమంతమైన రైఫిల్తో దుండగుడు పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అరెస్టు చేశారు. గత రాత్రి రాబర్ట్ ఇ.క్రిమో 3 అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి కారును చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టడంతో.. కారు నుంచి దిగి చేతులు పైకెత్తిన నిందితుడి వీడియోను అమెరికాలోని స్థానిక మీడియా విడుదల చేసింది. నిందితుడు క్రిమోపై పలు అభియోగాలు మోపినట్టు హైలాండ్ పార్క్ పోలీసులు తెలిపారు.
ప్రశాంతంగా జరుగుతున్న పరేడ్పై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేలుతున్నట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షి అయిన రిటైర్డ్ వైద్యుడు రిచర్డ్ కౌఫ్మన్ తెలిపారు. దాదాపు 200 షాట్లను విన్నట్టు చెప్పారు. అయితే బాణాసంచా అని భావించానని చెప్పిన ఆయన కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారని.. దీంతోనే తనకు ఇవి కాల్పులని అర్థంచేసుకున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాల్పుల విషయం తెలిసిన వెంటనే తాను, తన భార్య జిల్ షాకైనట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more