కర్నాటక ప్రతిపక్ష జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ తన నియోజకవర్గం మాండ్యా.. అన్ని విధాల అభివృద్దిలో అగ్రగామిగా ఉండేలా చూసుకుంటూన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిదిశగా మాండ్యా పయనిస్తున్నా.. ఆయన చేసిన తప్పిదం ఆయన చేసే మంచిపనులను పక్కనపెట్టిస్తోంది. ఎమ్మెల్యేగా ఆయన చేసిన తప్పడు పనులనే పెద్దగా చూపుతోంది. ఇంతకీ ఇలా చేసేది ఎవరు అని అంటారా.? మరెవరో కాదు.. నెటిజనులు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే నెటిజనులు ఆయన కోపాన్ని మాత్రమే సెల్ ఫోన్లలో బంధించి.. ఆయనను అబాసుపాలు చేస్తున్నారు.
ఇప్పుడాయనకు చెందిన ఈ వీడియోను మాండ్యాలోని ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా చూస్తోంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. మాండ్యాకు చెందిన జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్.. తన నియోజకవర్గంలోని నల్వాడీ క్రిష్ణరాజా వెడియార్ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ నాగానంద్ చెంపలు చేల్లుమనిపించారు. మాండ్యా నియోజకవర్గంలో శిధిలావస్థకు చెందిన ఈ ఐటీఐ కాలేజీకి కొత్త భవనాన్ని నిర్మించగా, దానిని ప్రారంభించేందుకు వెళ్లారు. ఇక అదే పనిలో భాగంగా ఆయన ప్రిన్సిపాల్ ను పిలిచారు.
అయితే ఎక్కడో వెనకాల ఉండటంతో కోపం తెచ్చుకున్న ఆయన.. సర్లే కానీ అంటూ.. ఐటిఔ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ డెవలప్మెంట్ వర్క్ గురించి అడిగారు. అయితే ప్రశ్నలు దాటవేత ధోరణితో ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వడంతో ఆయనకు కోపం వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే.. ప్రిన్సిపల్పై చేయి చేసుకున్నారు. పదేపదే ఆయన్ను కొడుతూ కనిపించారు. ఈ ఘటన జూన్ 20వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రిన్సిపాల్ను ఎమ్మెల్యే కొడుతున్న సమయంలో అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
— Sheetal Chopra (@SheetalPronamo) June 21, 2022
This happens when power goes to head
Shamepic.twitter.com/8RTCCud8Mo
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more