Masks A Must In Bengaluru Amid A Spike In Covid Cases బెంగళూరులోనూ పెరుగుతున్న కరోనా కేసులు.. అమల్లోకి అంక్షలు

Covid fear returns in karnataka as state sees spike in cases yet again

bengaluru covid, covid, covid 19 in karnataka, COVID fourth wave, Covid-19 crisis in Karnataka, fourth wave, fourth wave covid, Karnataka covid cases, Sonia Gandhi corona virus, Priyanka Gandhi coronavirus, shah rukh khan covid positive, Bengaluru covid cases, Mask mandatory in bengaluru, Fourth Wave Bengaluru, corona restrictions, coronavirus, Karnataka, India

The Karnataka Health Department has undertaken a slew of measures following the rise of Covid cases in the state, specially Bengaluru, in the last one week. The meeting of Covid Experts committee has discussed the prevailing situation and the department has undertaken a serological survey. The state recorded 230 fresh Covid cases in the last 24 hours. The positivity rate has gone up to 1.92 per cent and active cases in the state have risen to 2,441

బెంగళూరులోనూ పెరుగుతున్న కరోనా కేసులు.. అంక్షలను విధించిన ప్రభుత్వం

Posted: 06/07/2022 11:57 AM IST
Covid fear returns in karnataka as state sees spike in cases yet again

ధేశంలో మరోమారు కరోనా మహమ్మారి ప్రమాద గంటికలు మ్రోగిస్తోంది. మొన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో ఆ రాష్ట్రంలో కరోనా అంక్షలను అమలు చేయడంతో పాటు జనసామర్థ్యం కలిగిన ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ప్రభుత్వం ముందస్తుచర్యలు చేపట్టింది. మిలియన్ మార్కును దాటి యాక్టివ్ కేసులు ఉన్న రెండో రాష్ట్రం మహారాష్ట్ర. కేరళలో ప్రతి 10 లక్షల మందికి 264 యాక్టివ్ కేసులు ఉంటే, ముంబైలో అది 53 కేసులుగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.5 శాతానికి చేరుకోగా (పరీక్షల్లో పాజిటివ్ గా తేలుతున్న కేసులు).. ముంబైలో మాత్రం 8.8 శాతం, పాల్గర్ లో 4.9 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది. అంటే ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర సగటు పాజిటివ్ రేటును దాటిపోయాయి. థానే పట్టణంలో పాజిటివిటీ రేటు సోమవారం 20 శాతంగా నమోదైంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు ఉన్నందున పరీక్షల సంఖ్యను ముంబైలో పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. తాజాగా కర్ణాటకలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే దేశంలో  కరోనా మహమ్మారి నాలుగో దశ రానుందా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ తరువాత కర్ణాటకలోనూ మళ్లీ కరోనా కేసులు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అన్ని అప్రమత్తంగా ఉండాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది.

అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. అలాగే, మాల్స్‌ సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై తప్పనిసరి చేసి.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. కాగా, నిన్న కర్ణాటకలో 300 కేసులు నమోదై్య్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles