ధేశంలో మరోమారు కరోనా మహమ్మారి ప్రమాద గంటికలు మ్రోగిస్తోంది. మొన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంతో ఆ రాష్ట్రంలో కరోనా అంక్షలను అమలు చేయడంతో పాటు జనసామర్థ్యం కలిగిన ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు క్రమంగా పెరగడంతో ప్రభుత్వం ముందస్తుచర్యలు చేపట్టింది. మిలియన్ మార్కును దాటి యాక్టివ్ కేసులు ఉన్న రెండో రాష్ట్రం మహారాష్ట్ర. కేరళలో ప్రతి 10 లక్షల మందికి 264 యాక్టివ్ కేసులు ఉంటే, ముంబైలో అది 53 కేసులుగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.5 శాతానికి చేరుకోగా (పరీక్షల్లో పాజిటివ్ గా తేలుతున్న కేసులు).. ముంబైలో మాత్రం 8.8 శాతం, పాల్గర్ లో 4.9 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది. అంటే ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర సగటు పాజిటివ్ రేటును దాటిపోయాయి. థానే పట్టణంలో పాజిటివిటీ రేటు సోమవారం 20 శాతంగా నమోదైంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు ఉన్నందున పరీక్షల సంఖ్యను ముంబైలో పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. తాజాగా కర్ణాటకలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే దేశంలో కరోనా మహమ్మారి నాలుగో దశ రానుందా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ తరువాత కర్ణాటకలోనూ మళ్లీ కరోనా కేసులు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అన్ని అప్రమత్తంగా ఉండాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది.
అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. అలాగే, మాల్స్ సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై తప్పనిసరి చేసి.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. కాగా, నిన్న కర్ణాటకలో 300 కేసులు నమోదై్య్యాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more