బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. వరుస వివాదాలతో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై బయటకు వచ్చిన ఆయన తాజాగా మరో కేసులో ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ సోదాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాలూ కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2004 - 2009 మధ్య కాలంలో యూపీఐ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు.
ఆ సమయంలో రైల్వే డిపార్ట్ మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆశావాహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిలో అనేక మందికి ఉద్యోగాలు కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ లాలూపై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటుగా లాలూ కుటుంబసభ్యుల పేర్లను కూడా సీబీఐ ఛార్జ్ షీట్లో నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి లాలూ ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పట్నా, గోపాల్గంజ్, ఢిల్లీతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్మడి బీహార్కు సీఎంగా పనిచేసిన కాలంలో కోట్ల రూపాలయల విలువైన దాణా కుంభకోణం చోటుచేసుకోవడం, సీబీఐ దర్యాప్తు తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు కావడం తెలిసిందే. దాణా కుంభకోణానికే సంబంధించిన ఇతర కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా తేలి, జైలు శిక్ష కూడా అనుభవించారు. రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఇటీవలే జైలు నుండి విడుదలై బయటకు వచ్చారు. 73 ఏళ్ల లాలూ వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈక్రమంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో కుంభకోణం రుజువైందని సీబీఐ ఆరోపించడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. సీబీఐ తీరుపై ఆర్జేడీ నాయకులు మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ నేతను టార్గెట్ చేశారని.. సీబీఐ తీరు పక్షపాతంగా ఉందని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్లో ప్రస్తుతం జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ మిత్ర పక్షంగా ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీ కొనసాగుతోంది. ఈ క్రమంలో బలమైన గొంతుకను అణచివేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత ఆలోక్ మెహతా ధ్వజమెత్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more