నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు రోజుకో పూట బోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమైన పెట్రోల్, డీజిల్లపై పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకార ధోరణితో వ్యవహరిస్తూ పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను అవి ఉపసంహరించుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.
దీంతో సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని సంజీవ్ బబాజ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం.. తగ్గినప్పుడు తదనుగుణంగా ధర తగ్గించాలని హితవు చెప్పారు. ద్రవ్యోల్బణంపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఉందని పేర్కొన్నారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను చాలా ఎక్కువ. ఇది మనకు తెలుసు. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరగడం చూశాం.
ఇప్పుడు చమురు ధరలు పెరిగిపోయాయి. దీనిపై పరస్పర సహకార ధోరణితో చర్చించాల్సి ఉంది. ఒక దేశం కోసం చివరికి మనం ఈ పని చేయాలి. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకున్నది. సరైన సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి అని సంజీవ్ బజాజ్ సూచించారు. గతంలో కూడా భూ సేకరణ చట్టం, వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని గుర్తించి వాటిని వెనక్కు తీసుకున్నామని సంజీవ్ బజాజ్ గుర్తు చేశారు. ధరల స్థిరీకరణపైనే విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని సంజీవ్ బజాజ్ తెలిపారు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more