ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది. అధికారమే పరమావదిగా భావిస్తున్న ఎన్సీపీ మిత్రపక్షాన్ని నమ్మకద్రోహం చేసేందుకు కూడా వెనుకాడటం లేదని అరోపించింది. మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్సీపి ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపితో జతకట్టిందని సంచలన అరోపణలు చేశారు.
మిత్రపక్షంగా కోనసాగుతూనే.. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ ను బలహీన పర్చే చర్యలకు పూనుకుంటున్న ఎన్సీపి వ్యవహారాలపై తమ పార్టీ హైకమాండ్కు విషయం నివేదించానని ఆయన చెప్పుకొచ్చారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన ఆపై ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, గత రెండున్నరేండ్లుగా మహారాష్ట్రలో తమ పార్టీని ఎన్సీపీ బలహీనపరుస్తోందని ఆయన నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ నానా పటోలె వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు ఇతర స్ధానిక సంస్ధలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. గొందియా జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎన్సీపీ బీజేపీతో చేతులు కలిపిందని అన్నారు. భివాండి-నిజాంపూర మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్సీపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను తాము పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చామని, అయితే రానున్న రోజుల్లో పార్టీ మహారాష్ట్ర సర్కార్ పై కూడా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ఉదయ్పూర్లో ఇటీవల ముగిసిన పార్టీ చింతన శిబిరంలో ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ ఆగస్ట్, సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని నానా పటోలె తెలిపారు. రాహుల్ గాంధీని తమ నేతగా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. ఈ ఎన్నిక పూరైన తరువాత కాంగ్రెస్ మహావికాస్ ఆఘడి సర్కార్ పై దృష్టిసారిస్తుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా రాష్ట్ర నాయకత్వం బలమైన ప్రణాళికలను రూపోందిస్తుందని.. వాటిని అములు పర్చడంతో రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవాన్ని కోనసాగిస్తుందని విశ్వాసన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more