సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగితే.. ఎంత ఎక్కువ వేసినా.. రూ.1000లోపు మాత్రమే ఉంటుంది. కానీ ఓ అధికారి కోసం తీసుకువచ్చిన బిర్యాని ఖరీదు వింటే మెతుకు కూడా మింగలేరు. ఏంటీ వెయ్యి రూపాయలను మించి ఉంటుందా ఏంటీ అంటారా.. ఎక్కడ వేలు.. ఏకంగా లక్షల రూపాయల ఖరీదు చేస్తే.. ఔనా.. బిర్యాని ఖరీదు లక్ష.. అంటే కాదు ఏకంగా మూడు లక్షలు అని చెప్పాల్సివస్తుంది.
ఏమీటీ చిత్రం.. ఓ అధికారి భుజించిన బిర్యానీ ఖరీదు ఏకంగా రూ. 3 లక్షలా.? అంటూ నోరెళ్లబెట్టకండీ.. ఈ బిర్యాని మ్యాటర్ లోకి ఎంటరయ్యేముందు.. ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస్పత్రికి సమర్పించి అమోదముద్ర వసుకునే క్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం.. అంతుకుముందు ఇచ్చిన బిల్లులతో పాటు ఆ తరువాత సిద్దంగా వున్న ఇతర బిల్లుల బూజును కూడా దులిపింది. దీంతో అసుపత్రికి మెటీరియల్ సప్లయర్ కాంట్రాక్టు పోందిన వ్యక్తి అవినీతి బాగోతం బయటపడింది. దీంతో అసుపత్రి అధికారులు అతడిపై పోలీసులకు పిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ ఈస్ట్ బర్ధామన్ జిల్లాలోని కత్వా సబ్ డివిజన్ ఆస్పత్రికి కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్టర్ ఫర్నీచర్, వాహనాలతో పాటు అధికారుల కోరిక మేరకు అప్పుడప్పుడు బిర్యానీని సరఫరా చేస్తుంటాడు. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా సాగుతున్న అతని వ్యవహారంలోకి ఓ బ్రేక్ వచ్చింది. అప్పటివరకు ఉన్న అసుపత్రి సూపరింటెండెంట్ అక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆ ఆస్పత్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూపరింటెండెంట్ నియామకం అయ్యారు. ఆయన ముందు కాంట్రాక్టర్ రూ. కోటి విలువ చేసే బిల్లులను ఉంచాడు. పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని సూపరింటెండెంట్ అధికారులను ఆదేశించాడు.
అయితే సౌవిక్ ఆలం కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లుల్లో 81 బిల్లులను బోగస్గా గుర్తించాడు. అందులోని ఓ బిర్యానీ బిల్లు రూ. 3 లక్షలుగా ఉంది. దీంతో సూపరింటెండెంట్ షాక్ అయ్యారు. క్షణం ఆలోచించకుండా పేషెంట్ వెల్ఫేర్ కమిటీతో సౌవిక్ ఆలం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more