ఛత్తీస్గఢ్ లో విషాదం చోటుచేసుకుంది. రాయ్పూర్లో రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్పూర్లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్టులో ఫ్లైయింగ్ ప్రాక్టీస్ జరుగుతోంది. ఈ క్రమంలో హెలికాప్టర్ వేసుకుని ప్రాక్టీసుకు వెళ్లివచ్చిన పైలెట్లు.. హెలికాప్టర్ను ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటల్లో పైలెట్లు ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.
కాగా వారిని అసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. తీవ్ర గాయాల నేపథ్యంలో వారు చికిత్సకు స్పందించలేదు. దీంతో ఈ హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండే, కెప్టెన్ ఏపీ శ్రీవాత్సవ మరణించారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ప్రయాణికులు ఎవరు లేరు. కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనకు కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రంగంలోకి దిగాయి.
ఛాపర్ క్రాష్ లో ఇటీవల దేశ త్రివిధ దళాల అధినేత, బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 15 మంది మరణించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కొకనూర్ లో జిరగిన ఈ ఘటన తరువాత మళ్లీ అలాంటి ఘటనే చత్తీస్ గడ్ లో సంభవించడం విషాధాన్ని నిపింది. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పైలట్లకు నివాళులర్పించారు. ఇదొక బాధాకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలకు దేవుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
Tragic #helicopterCrash accident occurred at Swami Vivekanand airport Raipur, two pilots captain AP Shrivastva and captain Panda died in the crash. Chhattisgarh govt helicopter, #AugustaWestland -109. Earlier there were several complaints about the condition of the copter (SM) pic.twitter.com/oyWy6mcPGr
— avdhesh (@aviavi1001) May 12, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more