దేశంలోని పేదల సంక్షేమాన్ని నిత్యం జపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. నిజానికి దేశ:లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను మరింత ఉన్నతస్థాయిలో నిలిపే ప్రయత్నాలే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని పెదవులను దాటి వచ్చే పేదల అన్న మాట.. కేవలం జపం మాత్రమేనని, కానీ వారి కోసం ఆయన చేసింది ఏమీ లేదని రాహుల్ తీవ్రంగా దుయ్యబట్టారు. వారికోసం కేంద్రంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, వాటికి విధిల్చిన నిధులు చూస్తే ఈ విషయం ఎవరికైనా అవగతం అవుతుందని పేర్కోన్నారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్లుగా సృష్టించారని మండిపడ్డారు. దేశంలో కీలక వనరులను కొద్దిమంది సంపన్నులకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. దహోద్ జిల్లాలో ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో మోదీ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టకముందు గుజరాత్ సీఎంగా ఉన్నారని, గుజరాత్లో ఆయన చేసిన పనులే ఇప్పుడు దేశంలో చేస్తున్నారని దీన్ని గుజరాత్ మోడల్గా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
మోదీ సంపన్నులు, పేదల కోసం సృష్టించే రెండు భారత్లను కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కాషాయ సర్కార్ మీకు ఎలాంటి మేలు చేయకుండా మీ వనరులను లాగేసుకుంటోందని ఆరోపించారు. గిరిజనులు తమ హక్కులను సాధించుకుంటేనే వారికి రావాల్సిన వాటా దక్కుతుందని అన్నారు. గిరిజనుల కష్టంతో గుజరాత్లో రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, మౌలిక వసతులు సమకూరినా వారు తిరిగి పొందింది ఏమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు విద్య, వైద్యం అందుబాటులో లేదని ఆరోపించారు.
LIVE : आदिवासी सत्याग्रह रैली, दाहोद। गुजरात #AdivasiSatyagraha https://t.co/UNR627OQVj
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2022
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more