దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఇవాళ తెరుచుకున్నాయి, ఈ సందర్భంగా తొలి దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు కేదార్నాథ్ ఆలయానికి తరలివచ్చారు. ఏళ్ల నాటి సాంప్రదాయ ఆచారాన్ని అనుసరించి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్య గీతా ధామితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
కాగా, ఆలయం భక్తుల సందర్శనార్థం తెరుచుకుంటున్న నేపథ్యంలో.. ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. గత ఏడాది నవంబర్ 6న ఆరు నెలల పాటు మంచు నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ దేవాలయం యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్లతో సహా 'చార్ ధామ్'గా పిలుచుకునే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఎనిమిదో శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యచే కేదార్నాథ్ ఆలయం నిర్మితమైంది.
ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల పోర్టల్లను తెరవడంతో వార్షిక చార్ధామ్ యాత్ర మే 3న అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రారంభమైంది. బద్రీనాథ్ ఆలయ పోర్టల్స్ మే 8న తెరుస్తారు. ఈ నెల ప్రారంభంలో చార్ ధామ్లను సందర్శించే యాత్రికుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000 మంది, కేదార్నాథ్ వద్ద 12,000, గంగోత్రి వద్ద 7,000, యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతిస్తారు. 45 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం యాత్రికులు కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ గానీ, టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడం గానీ తప్పనిసరి కాదు.
Uttarakhand: The portals of #KedarnathDham opened this morning.
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) May 6, 2022
Chief Minister @pushkardhami offered prayers on the occasion.
The portals of #Badrinath shrine will open on Sunday. pic.twitter.com/fhL4Owd6cA
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more