మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థల ఖాతాలోకి చేరిపోయింది. రెండు వారాల క్రితం ట్విట్టర్లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. మస్క్ ప్రతిపాదనలకు ట్విట్టర్ బోర్డు అంగీకారం తెలిపింది. 44 బిలియన్లుకు డీల్ కుదిరినట్లు ప్రకటన వెలువడింది. కాగా ట్విట్టర్ -ఎలాన్ మస్క్ మధ్య ఈ క్యాష్ డీల్ ఈ ఏడాది చివరి కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మస్క్ 36 శాతం అదనంగా చెల్లించారు.
ఈ డీల్ లో భాగంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్కు 54.2 డాలర్లను చెల్లించనున్నారు. ట్విట్టర్లో తనకు 9.2 శాతం వాటా ఉందని మస్క్ ప్రకటించినప్పుడు ఉన్న ట్విట్టర్ షేర్ ధర కంటే ఇది 36శాతం అధికం. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు మస్క్. తాజాగా కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. దీంతో ట్విట్టర్ హస్తగతం చేసుకోవాలన్న ఆసక్తి నేపథ్యంలో మస్క్ ఏకంగా 36శాతం మేర అదనంగా చెల్లింపులు చేపట్టాల్సి వచ్చింది. ట్విట్టర్ తన ఆఫర్ను అంగీకరించాక ఎలాన్ మస్క్ ఓ ప్రకటన చేశారు.
భావ ప్రకటన స్వేచ్ఛ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి… భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమని పేర్కొన్నారు. ట్విట్టర్లో అది చాలా ముఖ్యమని, భవిష్యత్తులో దీని ప్రాధాన్యత చాలా ఉంటుందని మస్క్ రాసుకొచ్చారు. ట్విట్టర్ కు అపారమైన శక్తి ఉందని, కంపెనీతో కలిసి పని చేసేందుకు ముందుంటానని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ అన్నారు. ట్విట్టర్ తో ఎంతో ప్రయోజనం ఉందని.. దీనికి చాలా ఔచిత్యం ఉందన్న ఆయన.. ఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. తమ టీమ్ సభ్యుల పట్ల చాలా గర్వంగా ఉందన్నారు.
గత కొంతకాలంగా.. ట్విట్టర్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు మస్క్. ట్విట్టర్లో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అభిప్రాపడ్డారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత మస్క్తో ట్విట్టర్ చర్చలు జరిపింది. కంపెనీ బోర్డులోకి మస్క్ను చేర్చుకునేందుకు సిద్ధపడింది. తొలుత.. మస్క్ సైతం ఇందుకు అంగీకరించారు. బోర్డులో చేరడం సంతోషకరం అని అన్నారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ట్విట్టర్కు షాక్ ఇస్తూ.. మొత్తం సంస్థనే కొనుగోలు చేసేందుకు భారీ డీల్ను ముందుకు తీసుకురావటం.. తాజాగా డీల్ ఓకే కావటం చకచకగా జరిగిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more