ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ఎదురించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను కూడా అక్రమార్కుల అనుచరులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా కృష్ణా జిల్లాలో ఈ అక్రమాలు అత్యధికంగా సాగుతున్నాయి. ఏ జిల్లా చూసినా ఏముంది గర్వకారణం.. అదే అక్రమాలు, దౌర్జన్యాల భాగోతం అన్నట్లుగా మారింది వ్యవహారం. ఈ అక్రమాలు తప్పు కదా అన్న మాట వినపబడితే చాలు వారి నోటి నుంచి మరోమాట రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇక గొంతెత్తి అరిచే ధైర్యం ఎవరు చేస్తారు.
అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది. ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు.? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మాత్రం వారేం చేస్తారు. వారు మాత్రం మానవమాత్రులు కాదా.? వారికి కుటుంబాలు లేవా.? అన్న వాదనలు కూడా అక్రమార్కుల నుంచి వినిపిస్తోంది. అయినా గొంతెత్తి అరిచే వాళ్లు.. అవినీతిని సహించని అధికారులు ఇంకా ఉన్నారు. అయితే వారిలోని ధైర్యాన్ని కూడా అక్రమార్కులు హరించేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, యంత్రాంగం ఏది మారినా.. ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఆగడాలకు మాత్రం అడ్డుఅదుపు లేకుండా పోతోంది.
తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి ఆర్ఐపై మట్టిమాఫియా మనుషులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడినవారు అక్రమార్కులకు అధికార వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకే రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పై జేసీబీతో దాడి చేశారు. గుడివాడ మండలం మోటూరులో ఈ హత్యాయత్నం జరిగింది. అధికార పార్టీ వర్గీయులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులే ఈ మట్టిమాఫియాను చేపడుతున్నారన్న అరోపణలు ఉన్నాయి.
గుడివాడ మండలం మోటూరులో పల్లె నిద్రపోయిన వెంటనే నిద్రలేస్తున్న అక్రమార్రులు తమ అక్రమ వ్యాపారాలకు పనిచెబుతున్నారు. రాత్రి వేళ మట్టితవ్వకాలు చేపడుతూ.. ఉదయానికి గొతులమయంగా మార్చేస్తున్నారు. అయితే పక్క సమాచారం అందడంతో.. మట్టిమాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులకు దిగారు. అప్పటికీ తమ స్వరం మార్చని అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కులుగా తమ నిబద్దతను చాటుకునే అధికారులను ఏకంగా హత్యమార్చే ప్రయత్నాలకు కూడా తెగబడుతున్నారు.
మోటూరులో అక్రమ మట్టితవ్వకాలను ఆర్ఐ అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు ఆయనపై దాడికి దిగి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే తృటిలో తప్పించుకున్న ఆర్ఐ అరవింద్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘గుడివాడ తహశీల్దార్ ఫోన్ చేసి.. అక్రమ మట్టితప్వకాలు జరుగుతున్నాయి.. వాటిని అపాలని అదేశించారు. దీంతో వీఆర్ఏ, వీఆర్వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లగా.. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో కొంతమంది మట్టితవ్వకాలు చేపడుతున్నారు.. ఆపాలని చెప్పినా.. వారు పెడచెవిన పెట్టారు. నాతో వాగ్వాదం చేశారే తప్ప తవ్వకాలు అపలేదు. అంతేకాదు తనపై జేసీబీతో దాడి చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more