ఆనంతపురం జిల్లాలో మరోమారు బందిపోటు దొంగలు రైలు ప్రయాణికులపై స్వైరవిహారం చేశారు. దేశంలో రైలు ప్రయాణాలను సురక్షితం చేస్తూ రైల్వేశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బందిపోటు దోంగలు మాత్రం వాటిని చేధించుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు బందిపోట్లు రైలు ప్రయాణికులను టార్గెట్ చేయడం దేశంలోని ఏదేని ఒక అనువైన ప్రాంతంలో మాటు వేసి.. దోపిడికి ప్లాన్ చేయడం పరిపాటిగా మారింది. రైలు ప్రయాణాల్లో ఎలాంటి దోపిడీలు జరగకుండా రైల్వే పోలీసులు కూడా గస్తీ కాస్తున్నా.. ఈ దోపిడీలు జరగడం కలకలం రేపుతోంది.
ఈ సారి ఏకంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న వెంకన్న స్వామి భక్తులనే బందిపోటు దోంగలు టార్గెట్ చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైలులోని శ్రీవారి భక్తులను టార్గెట్ చేసిన బంధిపోట్లు.. వారిని తమ చేతుల్లోని ఆయుధాలతో బెదిరించి మహిళలు, పురుషుల మెడలోంచి బంగారు ఆభరణాలతో పాటు.. భక్తులు జేబుల్లోంచి నగదును కూడా లాక్కున్నారు. శుక్రవారం అర్థరాత్రి అనంతపురం జిల్లాలో ఈ భారీ దోపిడికి బందిపోట్లు పాల్పడ్డారు. జిల్లాలోని గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ తీగలను కత్తిరించిన దొంగలు ఈ దోపిడికి పాల్పడ్డారు.
సిగ్నల్ లేకపోవడంతో తరుకపల్లి రైల్లే స్టేషన్ కు కొంత దూరంలో సెవెన్ హిల్స్ రైలును లోకోపైలెట్ నిలిపివేశారు. దీంతో అప్పటికే అక్కడ మాటువేసిన బంధిపోట్లు వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపి ప్రయాణికులను భయపెట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో దుండగులు ఎంతమేర దోచుకెళ్లారన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. కానీ.. ఆరు తులాల నగలు, పెద్దమొత్తంలో నగదు దోచుకున్నట్లు సమాచారం. దోపిడీ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలించారు. అప్పటికే వారు పరారవ్వడంతో.. రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more