తెలంగాణ టాలీవుడ్ ప్రముఖలకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంలో తమ అదేశాలను అమలుపర్చకుండా తాత్సారం చేయడంతో పాటు ధిక్కారానికి పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్లకు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రికార్డులను ఇవ్వడం లేదంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను న్యాయస్థానం ఇవాళ చేపట్టింది.
ఈ సందర్భంగా ఈడీ అధికారులకు సంబంధిత సమాచారం ఇవ్వని కారణంగా కోర్టు ధిక్కారానికి పాల్పడిన సోమేశ్ కుమార్, సర్ఫరాజ్ల అహ్మద్ లకు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వాడారంటూ దాఖలైన కేసును గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందన్న ప్రాథమిక సమాచారంతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా నాడు దర్యాప్తు చేసిన బృందం సేకరించిన నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు అందజేయాలని తెలంగాణ సర్కారుకు ఈడీ లేఖ రాసింది.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈడీ అధికారులు నేరుగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు... ఈడీ కోరిన వివరాలన్నీ అందించాలంటూ గతంలోనే తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం నుంచి తమకు ఇంకా వివరాలు అందలేదని తాజాగా మరోమారు హైకోర్టును ఆశ్రయించిన ఈడీ... తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించింది. ఈ వాదనలను విన్న హైకోర్టు సీఎస్తో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more