సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ముందుంటారు. తన గ్రూపు వ్యాపారాల కోసమే కాదు.. ఆయన తన హృదయాన్ని హత్తుకున్న వీడియోలను కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. అయితే ఈ క్రమంలో అడపాదడపా కొందరికి వరాలు కూడా కురిపిస్తుంటారు. పాత ద్విచక్రవాహనాల సామాగ్రితో కారును తయారు చేసిన వ్యక్తికి కొత్త బోలెరో వాహనాన్ని అందించారు. అంతేకాదు సృజనాత్మకమైన ఐడియాలతో ముందుకువచ్చే ఇన్నోవేటర్స్ కు కూడా తన సహకారం అందించేందుకు ముందుంటారు.
సైకిల్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ రూపోందించిన గురు సౌరబ్ అండగా వుంటానని ప్రోత్సహించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించి వెన్నుతట్టుతుంటారు. అలాంటి ఆనంద్ మహీంద్ర తాజాగా మౌంట్ ఎవరెస్ట్ కు సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. మరొకరు పోస్ట్ చేసిన వీడియోను ఆయన రీపోస్ట్ చేశారు. ‘‘మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై నుంచి 360 డిగ్రీల కోణంలో చూపించేది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. నీవు ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నావని ఊహించుకుని, ప్రపంచాన్ని విశాలంగా చూసేందుకు ఇది సాయపడుతుంది. పెద్ద అంశాన్ని సులభంగా చూడొచ్చు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
360 degree view from the top of Mount Everest. Sometimes, when you have to make hard decisions, it helps to imagine you’re on top of Everest with an unobstructed view of the world. Becomes easier to see the ‘big picture.’
— anand mahindra (@anandmahindra) April 5, 2022
pic.twitter.com/qciTw4L7j4
ఇక మరో ట్వీట్ లో దేశం సూపర్ పవర్ గా ఎదిగేందుకు దోహదపడే విండ్ టర్భైన్ల గురించి ప్రస్తావించారు. ఈ తరహా సాంకేతికతను భారత్ పోందగలిగి.. అమలుపర్చితే కచ్చితంగా ప్రపంచశక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. నిత్యం ట్రాఫిక్ నడిచే రోడ్డు మధ్యలో ఓ గాలితో తిరిగే టర్బైన్ ఉంటుంది. వాహనాల వేగానికి ఆ టర్బైన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా ఒక గంటలోనే 1 కిలోవాట్ శక్తి జనిస్తుంది. ఈ సాంకేతికతను టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
భారత్ లో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందేనని, ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే పవన విద్యుత్ రంగంలో భారత్ కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు, టర్కీ అభివృద్ధి చేసిన విండ్ టర్బైన్ పనితీరు వీడియోను కూడా పంచుకున్నారు. తన ట్వీట్స్ తో సానుకూల ఆలోచనలను, భావాలను పెంచే ప్రయత్నం కూడా ఆనంద్ మహీంద్రా చేస్తుంటారు. ఆయన ట్వీట్స్ ఎంతో మందిని ఆలోచింపజేస్తుంటాయి.
Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo
— anand mahindra (@anandmahindra) April 6, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more