నాలుగేళ్ల క్రితం తన తాతయ్య ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన చివరకు విషాదాంతం అయ్యింది. ఇంటర్ విద్యార్థి హత్యకు గురైనట్టు బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన హర్ష(18) అనే యువకుడు 2018 నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై అతని తండ్రి రత్నుకుమార్ నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతని అచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, చివరకు తాగిన మైకంలో హంతకుడు తనతో పెట్టుకోవద్దని స్నేహితులకు వార్నింగ్ ఇవ్వడంతో హత్య వ్యవహారం బయటపడింది.
అసలు జరిగిందేంటీ.. చాగల్లుకు చెందిన ఇంటర్ విద్యార్ధి హర్షకు తన తాతయ్య ఊరు దారవరంలోని ముగ్గురు యువకులతో స్నేహం ఏర్పడింది. క్రికెట్ ఆడే సమయంలో భవన నిర్మాణ కూలీలతో చిగురించిన స్నేహన్ని కల్మషం లేని హర్ష నమ్మాడు. దీంతో 2018లో దీపావళి సెలవులు రాగానే నేరుగా తన తాతయ్య గ్రామం దారవరంకు వెళ్లిన హర్ష.. క్రికెట్ అడేందుకని ఇంట్లోంచి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అయితే హర్ష తాత ఇచ్చిన సమాచారంతో ఆయన తండ్రి వచ్చి నిడదవోలు పోలీసులకు పిర్యాదు చేయడంతో మిస్పింగ్ కేసు నమోదైంది.
క్రికెట్ ఆటలో ఏర్పడిన విభేదాలతో హర్ష స్నేహితులే అతడ్ని హత్య చేసినట్లు తాజాగా బయటపడింది. వేలివెన్నులో ఇంటర్ చదువుతున్న హర్ష దీపావళి సెలవకు దారవరంలోని తాత శ్యాంసన్ ఇంటికి హర్ష వెళ్లాడు. ఆ సమయంలో నిడదవోలు జూనియర్ కాలేజీలో క్రికెట్ ఆడేందుకు పాత స్నేహితులైన షేక్ రషీద్, ఆదిత్య, మునీంద్రలతో కలిసి వెళ్లాడు. ఆటలో ఏర్పడిన తగదాలతో ముగ్గురు కలిసి హర్షను మెడకు తాడు బిగించి చంపేశారు. తర్వాత శవాన్ని కాలేజీలో వినియోగంలో లేని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఆ తరువాత గత ఏడాది దానిని బయటకు తీసి నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాల్వలో పడేశారు.
నాలుగేళ్లుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇటీవల మద్యం మత్తులో రషీద్ తన మిత్రులకు వార్నింగ్ ఇచ్చాడు. తనతో జాగ్రత్తగా ఉండాలని., అవసరమైతే హతమరుస్తానంటూ వారిని బెదిరించాడు. పోలీసులు రషీద్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో హర్ష మర్డర్ సంగతి బయటపడింది. విషయం తెలిసిన నిందితులు ఆదిత్య., మునీంద్ర పరారయ్యారు. నిడదవోలు జూనియర్ కాలేజీ సెప్టిక్ ట్యాంకులో మిగిలిన ఉన్న ఎముకల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటికైనా తిరిగొస్తాడనుకున్న కుమారుడు హత్యకు గురైయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more