పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించినందుకు గాను ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గౌసుద్దీన్ తాహపై పిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. గత అర్థరాత్రి కార్పోరేటర్ గౌసుద్దీన్ పోలీసుల పట్ల దురుసగా వ్యవహరించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దీంతో బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు ఈ వీడియోలను రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపి మహేందర్ రెడ్డీల కు ట్యాగ్ చేసి.. ఇలాంటివారిపై చర్యలు చేపట్టగలరా.? అని కామెంట్ చేశారు. ఈ వీడియోలపై ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్పూర్ కార్పొరేషన్ గౌసుద్దీన్ను అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 350, 506 కింద కేసులు నమోదు చేశారు.
కాగా ముషీరాబాద్లోని భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ పెట్రోలింగ్ పోలీసులతో దుర్భాషలాడాడు. రాత్రిపూట హోటళ్లు నడిపేందుకు అనుమతి లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసుల పట్ల కార్పొరేటర్ గౌసుద్దీన్ అనుచితంగా ప్రవర్తించాడు. రంజాన్ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఇటు వైపు రాకూడదని కూడా పోలీసులకు సూచించామని.. అయినా ఎందుకు వచ్చారని నిలదీశాడు. హోటళ్లు రాత్రంతా తెరిచేఉంటాయని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
పోలీసుల ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా.. కార్పోరేటర్ సహా అతని వ్యక్తులు బిగ్గరగా అరుస్తుండటంతో అధికారులకు వినబడనీయకుండా అడ్డుతగిలారు. పోలీసులు తమాషాలు చేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. వచ్చినవాళ్లు డ్యూటీ చేసుకుని వెళ్లిపోవాలంటూ పోలీసులను హెచ్చరించారు. తమ డ్యూటీని తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగా.. ‘‘రూ.100 తీసుకునేవాడివి నాకే ఎదురు చెబుతావా?’’ అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలిస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
ఇక ఇవాళ ఉదయం ఈ ట్వీట్లు చూసిన మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా.. వారిని అవమానించే రీతిలో వ్యవహరించిన ఎంఐఎం కార్పోరేటర్ మహమ్మద్ గౌసుద్దీన్ టాహపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు శాంతిభద్రతలను అందించే పోలీసులపై నాయకులే దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమన్న మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేటర్ గౌసుద్దీన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్పోరేటర్ ను అరెస్టు చేశారు.
A clear warning to @hydcitypolice not to enter his area for the next 30 days & abusing the officers on duty.
— Raja Singh (@TigerRajaSingh) April 5, 2022
Too much freedom leads to this.
The video is from the Musheerabad area of Hyderabad city, @CPHydCity can we expect some action against such people. @TelanganaDGP pic.twitter.com/Am9dniF83E
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more