Petrol, diesel prices hiked again today, 13th hike in 15 days వాహనదారులను బెంబేలెత్తిస్తున్న ఇంధన దరలు..

Petrol diesel prices hiked again up by nearly rs 10 in 2 weeks

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices were hiked again by 80 paise a litre each, taking the total increase in rates in the last two weeks to ₹ 9.20 per litre. Rates have been increased across the country and vary from state to state depending upon the incidence of local taxation. This is the 13th increase in prices since the ending of a four-and-half-month long hiatus in rate revision on March 22.

వాహనదారులపై చమురు సంస్థల నిట్టనిలువు దోపిడి.. పక్షం రోజుల్లో రూ.10 వరకు పెంపు..

Posted: 04/05/2022 11:15 AM IST
Petrol diesel prices hiked again up by nearly rs 10 in 2 weeks

ఇంధన ధరలపై కేంద్రం ఎన్నికలకు ముందు ఒకలా వ్యవహరిస్తూ.. ఎన్నికల తరువాత మరోలా వాహనదారులను నిట్టనిలువునా దోపిడి చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ఇంధనధరల పెంపు నేపథ్యంలో ద్వంద విధానాలను అవలంభిస్తోందన్న అరోపణలు వున్నాయి. ఓవైపు ఇంధన సంస్థలకు ధరలను రోజురోజుకు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూనే.. మరోవైపు ఇంధన ధరలపై కేంద్రం విధించే పన్ను చాలా తక్కువని, ఇక రాష్ట్రాల పన్నుభారమే బేసిక్ ఇంధన ధరల కన్నా ఎక్కువగా ఉందని ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ పోతోంది.

అయితే ప్రస్తుతం దేశంలో దాదాపుగా 19రాష్ట్రాల్లో బీజేపి పార్టీయే అధికారంలో ఉందన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తించి.. ఈ విధమైన ప్రచారాన్ని చేస్తే బాగుంటుంది. కేవలం బీజేపియేతర పాలిత రాష్ట్రాల్లో అధికారం అందుకునేందుకు మాత్రమే తమ కపటబుద్దిని చాటుతూ విషప్రచారాన్ని చేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇంధన అమ్మకాలపైనే రాష్ట్రాల పన్ను ఆయా రాష్ట్రాలకే పరిమితం. అయితే దేశంలోని ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపితే కేంద్రం పన్ను పడుతుందన్న విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రాల వారీగా అమ్మకాల వివరాలు తీసి.. లెక్కలు వేసి.. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల లాభాన్ని అర్జించింది కేంద్రమా.? లేక రాష్ట్రాలా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇదిలాఉంచితే కేంద్రం తాము తీసుకురావాలని అనుకున్న బిల్లులను, విప్లవాత్మకమైన విధానాలను ఏ రాష్ట్రం అభ్యంతరం తెలిపినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగానే చేస్తోంది. అత్యంత అభ్యంతరకరమైన మూడు వ్యవసాయ చట్టాలను కూడా పలు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపినా.. పంజాబ్ లోని మిత్రపక్షం శిరోమణి అకాళీదళ పార్టీ.. బీజేపి నుంచి దూరం జరిగినా.. అది చేయాలని అనుకున్న పనులు చేయకుండా వెనక్కు తగ్గలేదు. అయితే రైతులు ఏకంగా ఏడాదికి పైగా కాలం.. అందునా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. మొక్కవోని పోరాటం చేయడంతో సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు సాగుచట్టాలను వెనక్కు తీసుకుంది. అలాంటి పక్షంలో ఇంధన ధరలపై మాత్రం వ్యాట్ కాకుండా జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నలు కూడా ప్రజల్లో బలంగా వినబడుతున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే.. ఐదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ 2021లో జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇంధన ధరలను పెంచేది లేదని,  ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా.. ఫలితాల ప్రకటనకు ముందే ధరలు పెరగడంతో అవి నీటిమూటలేనని తేలిపోయాయి.

ఇక తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల పాట పెంపుకు స్వస్తి పలికిన ఇంధన సంస్థలు.. ఇక మళ్లీ వరస వాయింపులకు సిద్దమయ్యాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దీంతో పక్షం రోజుల వ్యవధిలో పదమూడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇక తాజాగా పెట్రోల్ పై 80 పైసలు డీజిల్ పై 0.80 పైసల మేర పెంచుతుండటం గమనార్హం. ఇక ఇవాళ కూడా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెంపుతో అటు డీజీల్ ధర కూడా వంద మార్కుకు చేరువలో పయనిస్తోంది. గత పదమూడు పర్యాయాల పెంపుతో ఇంధన ధరలు రూ.9.20 మేర పెరిగాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 104.61కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 95.87కు పెరిగింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 104.61 గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 119.67గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 103.92కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 110.11గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 100.19కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 114.28గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.02కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 120.66 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 106.29కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 119.47గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 104.72కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 118.59గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.104.62కు చేరింది.
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర 110.25 నమోదు కాగా, డీజిల్‌ ధర రూ. 94.01 పైసలకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles