కేంద్రం ప్రభుత్వానికి తెలిసే కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలకు పాల్పడుతోందని అయినా రెండు పార్టీలు లోలోన సహకరించుకుంటూ.. ప్రజల ముందు పోరాటం చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నాయిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగసొమ్మును బీజేపి, టీఆర్ఎస్ కలిసి పంచుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భారీ అక్రమానికి పాల్పడిందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అరోపించారు. కేసీఆర్ సర్కార్ పైన యుద్దం చేస్తున్నామన్న బీజేపికి సాక్ష్యాధారాలతో కూడిన చిట్టా ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
సింగరేణి బొగ్గుగనుల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓ బడా వ్యాపారవేత్తకు గనులు దక్కేలా కేసీఆర్ సర్కార్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాకు గండికొడుతోందని.. కాగా ఈ కుంభకోణంలో కేంద్రంలోని అధికార బీజేపికి కూబా భాగస్వామ్యం ఉందని ఆయన సంచలన అరోపణలు చేశారు. ఆధారాలతో పాటుగా తాము అక్రమాలపై పలు పర్యాయాలు పిర్యాదు చేసినా.. కేంద్రం చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ మీనమేషాలు లెక్కబెడుతోందని అరోపించారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా పదవిలో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సంబంధించిన వారికే సింగరేణి కాంట్రాక్టులు దక్కాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.50 వేల కోట్ల కాంట్రాక్టును ఒక సంస్థకు అక్రమంగా ఇచ్చారని అన్నారు. 49 శాతం వాటా ఉన్న కేంద్రం అక్రమాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. దొంగసొమ్మును భాజపా, తెరాస కలిసి పంచుకుంటున్నాయని మండిపడ్డారు. భారీ అక్రమాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదులపై స్పందించకపోతే... సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. నిబంధనలు కఠినతరం చేసి ఒక్క సంస్థే టెండర్లలో పాల్గొనేలా చేశారని తెలిపారు. కేసీఆర్ దోపిడీని కేంద్రంలోని భాజపా సమర్థిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more