హైదరాబాద్ నగరవాసులకు కొన్ని దశాబ్దాలుగా దహార్తిని తీర్చుతున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం కావడంపై విస్మయం వ్యక్తం చేశారు వాటర్ మాన్ ఆప్ ఇండియా రాజేంద్ర సింగ్. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని, సుప్రీంకోర్టు సహా ఎన్జీటీ లాంటి పలు న్యాయస్థానాలు గతంలో వెలువరించిన తీర్పులను ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చెందిన జలశయాలను పరిరక్షిస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిన నెల రోజుల లోపే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జీవో ఉపసంహరణపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
చెరువులను పరిరక్షిస్తామంటూ గత నెల 26న హైదరాబాద్లో జరిగిన 'జాతీయ నదుల పరిరక్షణ' సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించి నెల రోజులు కూడా తిరగకముందే సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయన్నారు. నిపుణుల కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వమే అయినందున వారు ఇచ్చే నివేదిక పాలకులకు అనుకూలంగానే ఉంటుందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం, రియల్టర్లకు లబ్దికోసమే ఈ జీవోను ఎత్తివేయాలని అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిపుణుల కమిటీ నివేదిక ఇందుకు భిన్నంగా ఉంటుందనే భావన కలగడంలేదని, 1996లో వెలువడిన ఈ జీవో ద్వారా ఏడు మండలాల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని సుమారు 1.32 లక్షల ఎకరాల భూమికి రక్షణ కల్పించిందని, ఇప్పుడు ఎత్తివేయడం ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి జలాశయాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. గోదావరి నుంచి మల్లన్నసాగర్ మీదుగా వచ్చే నీటితో హైదరాబాద్ నగరానికి వందేళ్ళ వరకు తాగునీటి సమస్య ఉండదని పేర్కొంటూ జీవో 111ను ఎత్తివేయడం గురించి సీఎం మాట్లాడడం సహజ వనరుల పరిరక్షణకు ప్రమాదాన్ని కొని తెస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడమంటే సుప్రీంకోర్టు 2001లో వెలువరించిన తీర్పుతో పాటు మరికొన్ని తీర్పులను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48-ఏ ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి చెరువులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ జీవోను ఎత్తివేయడం ద్వారా ఏకకాలంలో రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజంగా చెరువులను పరిరక్షించాలనే ఉద్దేశమే ఉన్నట్లయితే 84 గ్రామాల ప్రజలను మరో చోటికి తరలించవచ్చన్నారు.
ఈ తరహా చర్యలతో యావత్ దేశానికి రోల్ మోడల్గా కేసీఆర్ నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఈ రెండు చెరువులను, సహజ వనరులను కాపాడుకునేలా ఆదర్శంగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే అనివార్యంగా తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని, ఆ పరిస్థితులను ఆయనే కల్పించారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ కాకతీయ లాంటి పథకాలను రాజేంద్రసింగ్ గతంలో పూర్తిస్థాయిలో కీర్తించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more