తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో శాసనసభకు చేరుకున్న సస్పెండెడ్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతిని ఇవ్వలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావు గేటు వద్ద కొద్ది సేపు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, తమను సస్పెండ్ విషయంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల పూర్తి కాఫీ అందిన తరువాత తాము స్పీకర్ నిర్ణయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని సస్పెన్షన్ కు గురైన బీజేపి ఎమ్మెల్యేలు తెలిపారు. ఇక మరోవైపు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో దానిని బలంగా జనంలోకి తీసుకువెళ్లి.. వారి అండ పొందేందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ మార్చి 17 న ఆందోళనకు పిలుపునిచ్చింది.
"ఏకచక్రాధిపత్యం నుండి రాజ్యాంగాన్ని కాపాడాలి’’ అనే నినాదంతో నిరసన వ్యక్తం చేయబడుతుంది. మాజీ బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పోరేటర్లు, బీజేపి జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు అన్ని అనుబంధ సంస్థలు, యువమోర్చా, మహిళా మోర్చలతో పాటు బిఎంఎస్ సహా అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు, కార్మికులతో పాటు నిరసనలో పాల్గొంటారని బీజేపి ఇప్పటికే తెలిపింది. కాగా శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని హైకోర్టు సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more