2 Terrorists killed in encounter in J-K జమ్మూ షోపియాన్లో ఎన్‌కౌంటర్‌.. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

2 terrorists killed in encounter in j k s shopian j k police

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Shopian encounter, Amshipora encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, Budgam encounter JK, Jammy encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Shopian, Jammu and Kashmir, National politics

Two Jaish-e-Mohammad (JeM) terrorists were killed in an overnight encounter with security forces in Shopian district of Jammu and Kashmir, police said on Friday. The encounter broke out in Shopian's Amshipora area on Friday, a police official said. Two terrorists were killed in the exchange of fire with the security forces, the official said.

జమ్మూలోని షోఫియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Posted: 02/25/2022 05:53 PM IST
2 terrorists killed in encounter in j k s shopian j k police

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని షోఫియాన్ జిల్లాలోని ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని అమ్మీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

కాగా ఈ ఎన్ కౌంటర్ తో హతమైన ఉగ్రవాదులు జైష్-ఈ- మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా బధ్రతాదళాలు గుర్తించాయి. షోఫియాన్ జిల్లాలోని అమ్మిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. భద్రతా దళాలతో కలసి అమ్మిపోరా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపైకి ముష్కరులు కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో హుటాహుటిన స్పందించిన గాలింపు దళాలు కూడా ప్రతిదాడులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. అయితే స్థానికంగా ఉద్రగవాదుల కోసం భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు జరుపుతున్నాయి.

షోపియాన్  జిల్లాలోని అమ్మిపోరా ప్రాంతంలో ఎన్ కౌంటర జరిగింది. దీంతో ఘటనాస్థలం మూడు ఎకే 56 తుపాకులు, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోనల్ పోలీసులు తెలిపారు. ఇక మరణించిన ఇద్దరిని గుర్తించే పనిలో వున్నామని తెలిపారు. ఇక పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఉగ్రమూకలు ముందుగా కాల్పులకు తెగబడిన పరిస్థితుల్లో భారత భద్రతా బలాగాలు కూడా కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles