TTD to issue sarva and Seegra Darshan tickets శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ బోర్డు

Ttd shares good news to devotees to issue sarva and seegra darshan tickets

Tirumala, Tirupati, Tirumala Tirupati Devasthanams, TTD, TTD Board chairman, YV Subba Reddy, Sarva Darshan tickets, Seegra Darshan tickets, Arjitha Sevas, replace hotels, fast food centres, free Annaprasadam centres, Darshan tickets, Arjitha Sevas, Budget, Andhra Pradesh, Devotional

The Tirumala Tirupati Devasthanams (TTD) Board of Trustees, which met under the chairmanship of YV Subba Reddy decided to increase issuance of Sarva Darshan and Seegra Darshan tickets and allow devotees to take part in Arjitha Sevas.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. పెరగనున్న శ్రీఘ, సర్వదర్శన టికెట్ల సంఖ్య

Posted: 02/22/2022 04:32 PM IST
Ttd shares good news to devotees to issue sarva and seegra darshan tickets

కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి ప్రభావం దినదినం తగ్గుతున్న తరుణంలో గత రెండేళ్లుగా తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని మారుమూల గ్రామాలకు చెందిన భక్తులకు శ్రీవారి దర్శనం అవకాశాలు సన్నగిల్లాయి. కోవిడ్ అంక్షల మధ్య ప్రతినిత్యం వేలాది మంది భక్తుల హరినామస్మరణలతో ప్రతిధ్వనించాల్సిన సప్తగిరులు.. భక్తులు లేక వెలవెలబోయింది. దీంతో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వాలు ఎత్తివేసిన తరుణంలో తిరుమలగిరులకు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా టీటీడీ కార్యచరణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఇప్పటికే సర్వదర్శన టోకన్లు ఆఫ్‌లైన్‌ విధానంలో ఇవ్వడాన్ని ప్రారంభించిన టీటీడీ.. ఈనెల 26 నుంచి 28 మధ్య రోజుకు అదనంగా 5వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, గోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇక అదే సమయంలో శీఘ్రదర్శన టోకన్లు కూడా అదనంగా జారీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు అదనపు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం (ఈ నెల 23న) ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అదనపు కోటాను విడుదల చేస్తున్నది. మార్చి నెలకు సంబంధించి రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం విడుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే మార్చి నెలకు సంబంధించి రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది. విషయాన్ని భక్తులు గమనించి tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles