టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబును పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణలను ఎదుర్కోంటున్నారు. ఈ అరోపణల నేపథ్యంలో గత రాత్రి 11.30 గంటల సమయంలో సిఐడీ పోలీసులు అశోక్ బాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అశోక్ బాబు డిగ్రీ విషయమై విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెప్పించుకుని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.
ఉద్యోగ బాధ్యతల నుంచి ఉద్యోగ సంఘాల నేతగా అవతరించిన అశోక్ బాబు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. అయితే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు నిన్న అశోక్బాబు ఇంటి వద్ద మఫ్టీలో కాపుకాశారు. ఓ వివాహవేడుకకు హాజరైన అశోక్బాబు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి రాగా, అప్పటికే అక్కడ కాపుకాసిన సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోపక్క, ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అశోక్ బాబు అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్ట్ను కోర్టులోనే తేల్చుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more