మద్యం తీసుకోవడం శీతల ప్రాంతాలు, పాశ్చాత్య దేశాల జీవనశైలిలో భాగం. అయితే దీనికి అలవాటు పడినవారు మన దేశంలోనూ ఉన్నారు. తరం మారిన కొద్దీ మద్యం తాగితే తప్పులేదన్న భావన కలుగుతోంది. మనదేశంలో మితంగా తాగే హైక్లాస్ మనుషుల కన్నా మితిమీరి తాగే మాస్ మనుషులే అధికం. అన్నపానీయాలు లేకపోయినా పర్వాలేదు కానీ.. మద్యానికి డబ్బు లేకపోతే హైరానా పడిపోయే జీవాలు ఎన్నో. అలి మెడలోని తాళి తాకట్టు పెట్టైనా సరే.. కన్న బిడ్డల జీవితాలు కాలరాసిపోతున్నా.. తమకు మధ్యం ఉంటే చాలు అనేవారి సంఖ్య తక్కువేం కాదు.
అయతే వీరిని చూసిన వారు ‘మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది’ కానీ ఇలా ఒళ్లుపై తెలియకుండా తాగడం ఏంటీ అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి మద్యం మితంగా తాగితే అరోగ్యానికి మేలు చేస్తుందా.? అన్న ప్రశ్నకు కొందరు.. ఈ మేరకు వైద్యలే చెప్పారంటూ కూడా బుకాయిస్తుంటారు. అయితే ప్రచారంలో ఉన్న ఈ అపోహలో నిజమెంత.? అన్న విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. మద్యం తాగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, అరోగ్యంపై అవి చూపే పెనుప్రభావాల గురించి తెలుసుకుంటే దాని జోలికి వెళ్లాలంటేనే భయపడతారు. మద్యం తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మందికి పైనే ప్రాణాలు విడుస్తున్నారు.
గుండె జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, జీర్ణకోశం ఇలా ఎన్నో ప్రభావితమవుతున్నాయి. మితం, అపరిమితం అన్న తేడా లేకుండా ఎంత తీసుకున్నా మద్యం అరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గుండె జబ్బుల రిస్క్ ను స్వయంగా కొని తెచ్చుకున్నట్టేనని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే అంటోంది. మద్యంతో గుండె ప్రమాదంలో పడుతుందని చెబుతోంది. మద్యానికి దూరంగా ఉండాలని సిఫారసు చేస్తోంది. మద్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
మద్యం తీసుకోవడం వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నట్టు ఆక్స్ ఫర్డ్ అధ్యయనం తేల్చింది. ఇందులో సుమారు 4 లక్షల మరణాలు కేన్సర్ కారణంగా ఉంటున్నాయని తెలిపింది. నోటి క్యాన్సర్, గొంతు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మద్యానికి ధూమపానం తోడయితే, ఇతర ఆరోగ్య సమస్యలు, స్థూల కాయం వంటి వాటితో బాధపడుతున్న వారికి రిస్క్ మరింత పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కనుక దీర్ఘాయుష్షు కోసం మద్యాన్ని దూరం పెట్టడమే ఉత్తమం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more