తనకు వస్తున్న పింఛనును అకారణంగా అపేసిన అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన ఓ వృద్దరాలు.. తనకు రావాల్సిన దానిని ఎలాగైనా సాధించుకోవాలని భీష్మించుకుంది. అందుకు అమె నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతోనే పోరాటానికి దిగింది. దశాబ్దాల క్రితం వరకు ప్రభుత్వాలు తాము అమలుపరుస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోని లబ్దిదారుల వరకు చేరుతున్నాయా.? అన్న విషయాన్ని కూడా పట్టించుకునేవి కాదు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ప్రచార మాద్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న ప్రజలు ప్రభుత్వాలు అందించే పథకాలను తెలుసుకుంటూ వాటికి అర్హులైనవారు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.
ఈ కోవలోనే వృద్దాప్య పింఛన్ల గురించి కూడా సమాచారం అందుకున్న రాష్ట్ర వృద్దులకు ప్రభుత్వం అందించే పింఛన్లు చేరుతున్నాయి. అయితే వివిధ కారణాలు చూపుతూ అధికారులు తన పింఛను ఆపేయడంతో వృద్దురాలికి పాలుపోలేదు. తనకు వచ్చే ఫించనుపైనే అధారపడ్డానని, ఇప్పుడ అది ఒక్కసారిగా అగిపోయిందని.. అమె అధికారుల చుట్టూ తిరిగింది. గ్రామంలోని వాలెంటీర్ల నుంచి మొదలుకుని మండలం, జిల్లా స్థాయి అధికారుల వరకు అమె ప్రదిక్షిణలు చేసింది. అయితేనేం అమె సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఏకంగా అమె న్యాయపోరాటం చేసింది. రాష్ట్ర హైకోర్టు తలుపుతట్టడంతో అమెను విజయం వరించింది.
అమె పింఛనును వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఆమెకు చెల్లించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజనమ్మ (65) 2019 నుంచి పింఛను అందుకుంటున్నారు. జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను రావడం ఆగిపోయింది. దీంతో అధికారులను కలిసి ప్రశ్నిస్తే.. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు. అయితే, తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని అధికారులకు మొర పెట్టుకున్నా వినేవారు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఇక లాభం లేదని గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛనును పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే, ఆగిన కాలానికి సంబంధించి మొత్తాన్ని లెక్కకట్టి దానిని కూడా చెల్లించాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించారు. అయితే, ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను నిన్న సరోజనమ్మకు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more