కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రజలకు రెండవ దశకు ముందు అందుబాటులోకి వచ్చిన కరోనా వాక్సీన్ అడ్డుకట్ట వేస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే ఈ వాక్సీన్లను తయారు చేస్తున్న సంస్థలు పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయలేదని అందువల్ల రెండో దశలో తీవ్ర ప్రభావం చూపిన కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో అటు ఆక్సిజన్ అందుబాటు లేక, ఇటు రెమిడెసివీర్ మందు లభ్యంకాక మరోవైపు వాక్సీన్ కూడా అందుబాటులో లేకపోవడంతో పలువురు మృత్యువాత పడిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన కేంద్రం.. మెరుపు వేగంతో కరోనా వాక్సీన్ తయారు చేయించి మూడు నెలల వ్యవధిలో పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చింది.
ఇక వాక్సీన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రతీఒక్కరు ఈ వాక్సీన్ తీసుకునేలా పలు పథకాలతో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలుతు దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వాక్సీన్లను మాత్రమే దేశప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం.. ఆ తరువాత పలు విదేశీ వాక్సీన్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టకు వేయగలిగింది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో ఫార్మా సంస్థలు టీకాల ధరలను నిర్ణయించనున్నాయి.
సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండగా, దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200, కొవిషీల్డ్ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,భారత్ బయోటెక్ సంస్థలు ప్రభుత్వానికి అందజేశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more