దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు 60 ఏళ్లకు పైబడిన వయోజనులకు ప్రికాషనరీ కింద బూస్టర్ డోస్ ప్రక్రియ కూడా జనవరి 10 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక అదే విధంగా ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల బాలబాలికలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఈ వయస్సులోని పిలల్లు పోటీపడి మరీ వాక్సీన్ తీసుకోవడంతో ఈ గ్రూప్ వారికి శరవేగంగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే ఏకంగా మూడున్నర కోట్ల మంది యువ బాలబాలికలకు ఈ వాక్సీన్ ఇచ్చినట్టు కేంద్ర గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అయినప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారి సంఖ్య ఇప్పటికీ దేశంలో ఎక్కువగానే ఉంది. ఇలాంటి వారి కోసం హర్ గర్ దస్తాక్ అంటూ ప్రతీ ఇంటికీ వెళ్లి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇదిలావుండగా పలు దేశాలు బాలబాలికలకు కూడా కరోనా వాక్సీన్ ను అందజేస్తున్న తరుణంలో భారత్ కూడా మరో అడుగు ముందుకేసింది. త్వరలోనే 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కె.అరోరా దీనిపై మాట్లాడుతూ, 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు మార్చి నుంచి టీకాలు అందించే అవకాశముందని వెల్లడించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు.
ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం, 15 ఏళ్లకు లోపు వారికి వాక్సినేషన్ విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారని, 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారని అరోరా తెలిపారు. మిగిలిన వారికి ఈ నెలాఖరు కల్లా తొలి డోసు ఇస్తామని, తద్వారా వారు ఫిబ్రవరి చివరి నాటికి రెండో డోసు కూడా తీసుకుంటారని చెప్పారు. 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసు వారు దేశంలో 7.5 కోట్ల మంది ఉంటారని డాక్టర్ అరోరా సూచనప్రాయంగా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more