ఎన్నికల పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వీడారు. ఈ విషయంలో జనసేన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల పోత్తు అంశాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వదిలేసిన వారికి ధన్యవాధాలని చెప్పారు. అయితే ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని జనసేనాని తేల్చి చెప్పారు. జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన కార్యనిర్వాహక సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా, ఒంటరిగా నిర్ణయం తీసుకోనని, పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవచ్చు కదా.. అంటూ పలు పార్టీలు మనల్ని కోరుతాయని, అయినా.. తొందర పడకుండా, గంధరగోళానికి గురికాకుండా ఉండాలన్నారు.
రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆయా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతుంటాయని, ఆ మైండ్ గేమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పావులు కాకూడదని పవన్ పార్టీ నేతలను హెచ్చరించారు. పొత్తులపై ఒక్కో మాట మాట్లాడకూడదని, అందరమూ ఒకే పల్లవిని ఎత్తుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సంస్థాగతంగా ఇప్పుడిప్పుడే బలపడుతున్నామని, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని ఆయన పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సభలో పొత్తుల విషయాన్ని మరింత లోతుగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికలు రాకమునుపే ఏపీలో పొత్తులపై చర్చలు జరిగిపోతున్నాయి. దీనికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు కుప్పం వేదికగా మొదటగా ఆజ్యం పోశారు.
రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమను ముప్పేటదాడి చేస్తుందని అరోపిస్తున్న టీడీపీ.. రానున్న ఎన్నికలలో అప్పటి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత పోత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే జనసేనతో కలసి ఎన్నికలకు వెళ్తారా.? ఈ మేరకు కొన్నివార్తలు వినిపిస్తున్నాయని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా.. వన్ సైడ్ లవ్ తో లాభం లేదని, ఉంటే రెండు వైపులా ఇచ్చుపుచ్చుకునే పరిస్థితులు ఉండాలని టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రతిపక్షంగా వున్న బీజేపి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. అవసరం కోసం చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని ఎద్దేవా చేశారు. అవసరం తీరిపోయాక విడిచిపెడతారని మండిపడ్డారు. 1996 నుంచి చంద్రబాబు అందర్నీ లవ్ చేస్తూనే వున్నారని సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన కార్యనిర్వాహక సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే, ఒంటరిగా నిర్ణయం తీసుకోనని, పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తానని కూడా హామీ ఇచ్చారు. పొత్తు పెట్టుకోవచ్చు కదా.. అంటూ పలు పార్టీలు మనల్ని కోరుతాయని, అయినా.. తొందర పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more