సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’లో రీ-ఇన్ ఫెక్షన్ ప్రభావం కూడా మూడు రెట్లు అధికంగా వుందని, ఇది డెల్టా వేరియంట్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇప్పటికే అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కోత్త వేరియంట్ దేశంలోనూ చోచ్చుకోచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకరు 66ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా, మరోకరు 46 ఏళ్ల వయస్సున్న డాక్టర్ అని కర్ణాటక రాష్ట్ర వైద్యవర్గాలు వెల్లడించాయి. అయితే ఈ డాక్టర్తో సన్నిహింతగా మెలిగిన ఐదగురికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని ఆయనకు ఒమిక్రాన్ సోకడం పట్లు కలవరం మొదలైంది. ఇలా ఇంకెంతమందికి ఈ వైరస్ సోకిందన్న నేపథ్యంలో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇక తాజాగా.. ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆసుపత్రిలో ఎనమిది మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరగా, ఇవాళ మరో నలుగురు అనుమానితులు చేరినట్లు తెలిసింది. కాగా వీరిలో ఇద్దరు యూకేకు చెందినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్కు, ఇంకొకరు నెదర్లాండ్స్కు చెందిన వారని తెలుస్తోంది. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
ఈ క్రమంలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న పరిశోధనల గ్రూపు కేంద్రానికి ఓ సూచన చేసింది. 40 ఏళ్ల వయసు దాటిన వారితో పాటు ఆరోగ్యపరింగా రిస్క్ ఉన్నవారికి కూడా కరోనావైరస్ బూస్టర్ డోసు వాక్సీన్లు ఇవ్వాలని సూచించింది. కరోనా వైరస్లో జరుగుతున్న జన్యు పరిణామాలను పరిశీలిచేందుకు 28 పరిశోధనశాలలతో కూడిన కన్సార్టియం ఇన్సాకాగ్.. తన వీక్లీ బులిటెన్లో ఈ సిఫారసు చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాలని, ఆ తర్వాత 40 ఏళ్లు దాటినవాళ్లకు.. రిస్క ఉన్నవాళ్లకు బూస్టర్ డోసు టీకాలు ఇవ్వాలని ఇన్సాకాగ్ తెలిపింది. ఇప్పుడున్న వ్యాక్సిన్లలో తక్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయని, వాటితో ఒమిక్రాన్ను నిర్వీర్యం చేయడం కుదరదని, అందుకే బూస్టర్ డోసు తప్పనిసరి అని ఇన్సాకాగ్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more