దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి చేరుకుంటున్న వారిలో పలువురు కొవిడ్ బాధితులుగా తేలుతున్నారు. సౌతాఫ్రికా నుంచి శనివారం బెంగళూరు చేరుకున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, తాజాగా మహరాష్ట్రలోని పూణెలో మరో కేసు బయటపడింది. ముంబైలోని డొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తాజాగా న్యూఢిల్లీ మీదుగా ముంబైకి చేరుకున్నాడు. అయితే అతను కరోనాతో బాధపడుతున్నాడని అధికారులు పరీక్షలు జరిపిన అనంతరం గుర్తించారు. కాగా, అతడికి సోకింది భారత్ లో ప్రభావం చాటుతున్న డెల్టా వేరియంటా లేక దక్షిణాఫ్రికాలో జడలు విప్పిన నూతన వేరియంట్ ఒమిక్రానా.? అన్నది తెలుసుకునే పనిలో వైద్యుల బృందం ఉంది.
సదరు వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అయి ఉంటుందన్న అనుమానంతో నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఫూణేలోని వైరాలజీ కేంద్రానికి పంపించారు. బాధితుడిని కల్యాణ్-డోంబివ్లీ మునిసిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లోని ఆర్ట్ గ్యాలరీలో ఐసోలేషన్ చేశారు. ఈ తరుణంలో కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి) అధికారులు మాట్లాడుతూ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశామని, ఆ వ్యక్తి సహ-ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేడీఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పన్పాటిల్ తెలిపారు. బాధితుడి సోదరుడికి మాత్రం కరోనా నెగటివ్ అని తేలిందన్నారు.
ఇదిలావుండగా.. ఒమిక్రాన్ వేరియంట్పై పెరుగుతున్న ఆందోళనల మధ్య, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసీ) దక్షిణాఫ్రికాతో సహా ఒమిక్రాన్ ప్రభావం చూపుతున్న పలు దేశాల నుంచి గత పక్షం రోజుల వ్యవధిలో నగరానికి చేరకున్న 466 మంది ప్రయాణికుల జాబితాను సేకరించిన అధికారులు వారిని సంప్రదించడం ప్రారంభించారు. వారి నుంచి నమూనాలను కూడా సేకరిస్తున్న అధికారులు వాటిని పరీక్షలకు కూడా పంపి.. వారికి కరోనా లేదని నిర్థారణ చేసుకుంటున్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించి కరోనా ఉందని తేలితే జీనోమ్ పరీక్షలకు పంపుతామని అధికారులు తెలిపారు.
గత పక్షం రోజులుగా ముంబైకి చేరుకున్న 466 మంది ప్రయాణికుల్లో 97 మంది నగరవాసులని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ ప్రభావిత దేశాలకు నుంచి నగరానికి చేరుకన్నా లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించిన ప్రయాణీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ను తప్పనిసరి చేసేందుకు చర్యలను చేపడుతోందని తెలిసింది. దేశీయ ప్రయాణీకుల కోసం, రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కాగా, బెంగళూరులో వెలుగు చూసిన రెండు కేసులు ఒమిక్రాన్ కాదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more