కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత మూడు రోజుల వ్యవధిలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. అక్కడి మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగానే ఇక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. అమరావతి కోసం సుమారు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతులకు బీజేపి నేతలు అండగా నిలవాలని చెప్పి సూచనలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇవాళ ఈ మేరకు అత్యవసరంగా భేటీ అయిన ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన చిత్తూరు, నెల్లూరు సహా పలు జిల్లాల అనేక సహాయక చర్యలు చేపట్టాల్సిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ముగించే విషయమై చర్చించడంతో పాటు మూడు రాజధానులు బిల్లుపై కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు కూడా సమాచారం. రాజధానికి సంబంధించి మరో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా... అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని... ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.
అయితే ఈ బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్ సమావేశంలో తాను లేనని అన్నారు. అందుకని తనకు పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు. ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులే అని మరోమారు ఉద్ఘాటించిన ఆయన.. సుమారు రెండు రెండున్నరేళ్లుగా టీడీపీ ఈ అర్టిస్టులతో నిరసనలు నిర్వహిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more