భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వర్డల్ కప్ లో భాగంగా గత నెల 24న జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలిచిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. భారత్ ఓటమిని సంబరాలు జరుపుకున్న వారి జాబితాను రూపోందిస్తున్నామని, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో తన భార్య, తన అత్తవారింటిపై ఓ వ్యక్తి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
టీమిండియా ఓటమి పాలు కావడంతో తన భార్యతో పాటు అత్తింటివారు కూడా సంబరురాలు జరుపుకున్నాడని ఏకంగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి మరీ పిర్యాదు చేశాడు. దీంతో వారిపై దేశద్రోహం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనది భారత్ దేశమని, దేశం ఓటమి పాలు కావడం పట్ల క్రీడాస్ఫూర్తితో వ్యవహరించినా.. తన భార్య, అత్తవారింటి వారు మాత్రం పాకిస్థాన్ గెలిచినందుకు సంబరాలను జరుపుకున్నారని పేర్కోంటూ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఠాణాకు వెళ్లి తన భార్య సహా అత్తవారింటి సభ్యులపై కేసు పెట్టాడు.
దీంతో అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో షంగన్ఖేడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషాన్ మియా దేశ భక్తుడు.. టీమిండియా అభిమాని. ఆయన భార్య రబియా షంషీ మాత్రం పాక్కు మద్దతు తెలుపుతోంది. పాక్ క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో రబియా తన కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి పండుగ చేసుకుంది. పాక్ గెలిచిందంటూ అంబరాన్నంటే సంతోషం వ్యక్తం చేస్తూ వాట్సప్ స్టేటస్లోనూ పెట్టుకున్నారు. వారి తీరు ఇషాన్కు మంటపుట్టించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more