Ind vs Pak match: Man files case on wife భారత్-పాక్ మ్యాచ్: భార్య సహా అత్తింటివారిపై కేసు పెట్టిన భర్త

Up man lodges fir against wife in laws for celebrating pakistan s win in t20 world cup

Ishan miya, Rabia Shamsi, T20 World Cup, Pakistan, India, sedition, husband files case on wife, bursting crakcers, Whatsapp status, celebrating pakistan win, arrested for celebrating pakistan win, Azim Nagar, Rampur, Uttar Pradesh, Crime

A man has lodged a complaint against his wife and in-laws for allegedly celebrating Pakistan's victory over India in the T20 World Cup match held on Oct.24. The complainant Ishan Miya, resident of Azim Nagar of Rampur, Uttar Pradesh, has alleged that his wife Rabia Shamsi and her family burst crackers and put up WhatsApp status celebrating Pakistan's victory in the T20 World Cup match.

భారత్-పాక్ మ్యాచ్: భార్య సహా అత్తింటివారిపై కేసు పెట్టిన భర్త

Posted: 11/08/2021 05:18 PM IST
Up man lodges fir against wife in laws for celebrating pakistan s win in t20 world cup

భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వర్డల్ కప్ లో భాగంగా గత నెల 24న జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు గెలిచిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. భారత్ ఓటమిని సంబరాలు జరుపుకున్న వారి జాబితాను రూపోందిస్తున్నామని, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో తన భార్య, తన అత్తవారింటిపై ఓ వ్యక్తి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.

టీమిండియా ఓటమి పాలు కావడంతో తన భార్యతో పాటు అత్తింటివారు కూడా సంబరురాలు జరుపుకున్నాడని ఏకంగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి మరీ పిర్యాదు చేశాడు. దీంతో వారిపై దేశద్రోహం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనది భారత్ దేశమని, దేశం ఓటమి పాలు కావడం పట్ల క్రీడాస్ఫూర్తితో వ్యవహరించినా.. తన భార్య, అత్తవారింటి వారు మాత్రం పాకిస్థాన్ గెలిచినందుకు సంబరాలను జరుపుకున్నారని పేర్కోంటూ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఠాణాకు వెళ్లి తన భార్య సహా అత్తవారింటి సభ్యులపై కేసు పెట్టాడు.  

దీంతో అత‌డు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు స్థానిక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో షంగన్‌ఖేడాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇషాన్ మియా దేశ భ‌క్తుడు.. టీమిండియా అభిమాని. ఆయ‌న భార్య‌ రబియా షంషీ మాత్రం పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతోంది. పాక్ క్రికెట్ జ‌ట్టు చేతిలో టీమిండియా ఓడిన నేప‌థ్యంలో రబియా త‌న‌ కుటుంబ సభ్యులతో క‌లిసి బాణసంచా కాల్చి పండుగ చేసుకుంది. పాక్ గెలిచిందంటూ అంబ‌రాన్నంటే సంతోషం వ్య‌క్తం చేస్తూ వాట్సప్ స్టేటస్‌లోనూ పెట్టుకున్నారు. వారి తీరు ఇషాన్‌కు మంట‌పుట్టించి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కేసు న‌మోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husband  Wife  Ishan miya  Rabia Shamsi  T20 World Cup  Pakistan  India  sedition  Azim Nagar  Rampur  Uttar Pradesh  Crime  

Other Articles