దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినా..న్యాయస్థానంలో విచారణ సందర్భంగా మాత్రం పోలీసులు, సిట్ అధికారులు అందోళనకు గురవుతున్నారు. ఇదివరకే ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం సంధించిన ప్రశ్నలు వేసిన చురకలతో వారు బెంబేలెత్తిపోయారు.
ఈ కేసును కూడా ఒడవని ముచ్చలా మార్చోద్దని ఇదివరకే వ్యాక్యాలు చేసిన న్యాయస్థానం అంతకుముందు ప్రభుత్వానికి కూడా అక్షింతలు వేసింది. ఘటన జరిగి పక్షం రోజులు దాటినా సిట్ అధికారులు నివేదికను సమర్పించడంలో మరెన్ని రోజులు కావాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై విచారణ నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసు విచారణ సదర్భంగా యూపీ ప్రభుత్వానికి పలు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు పశ్నలు సంధించింది. ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు..?, సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 68 మందిని సాక్షులుగా గుర్తించామని, 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ ర్యాలీలో వందలాది మంది రైతులు ఉన్నారని, కేవలం 23 మంది సాక్షులు మాత్రమే వచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. సాల్వే బదులిస్తూ వాగ్మూలం కోసం ప్రకటన జారీ చేశామని, వీడియో ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. విచారణ కొనసాగుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బలమైన సాక్షులను గుర్తించడం అవసరం, ఎవరైనా సాక్షులు గాయపడ్డారా? అని ప్రశ్నించింది. వీడియోను త్వరగా పరిశీలించాలని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వాలని, సాక్షులకు పూర్తి బాధ్యత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి చెప్పింది. సాక్షులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more