ఇప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలలో పలు జిల్లాలకు మాత్రమే పరిమితమై క్రమంగా ఉనికి కోల్పోతున్న మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నేతలు హతులయ్యారు. తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం ఉదయం భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సరిహద్దులో చోటు చేసుకుంది.
తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ దళాలు కలిసి తెలంగాణలోని ములుగు జిల్లా, వాజేడు మండల పరిధిలోని పేరూరు పోలిస్ స్టేషన్ పరిధిలో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బీజాపూర్, ములుగు సరిహద్దులోని తర్లగూడ వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన మావోలకు వారి నుంచి ధీటుగా బదులు వచ్చింది. భద్రతా బలగాలు కూడా కాల్పులకు జరపడంతో.. ఇరు వర్గాల మధ్య కొంత సమయం భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి.
కాగా పోలీసుల కాల్పుల్లో తప్పించుకునే పరిస్థితి లేకపోవడం తూటలు తగలడంతో ముగ్గురు మావోయిస్టు నేతలు మరణించారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై ఎటూరు నాగారం ఏఎస్సీ గౌష్ ఆలమ్ మాట్లాడుతూ మరణించిన ముగ్గురు మావోయిస్టులను గుర్తించే పనిలో వున్నామని, అయితే వారి వద్ద నుంచి ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్ల స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ఆయుధాలు వారి వద్ద లభ్యం కావడంతోనే వారు డీసిఎం క్యాడర్ స్థాయి నేతలుగా భావిస్తున్నామని అన్నారు. వీరు హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ దళానికి చెందిన మావోయిస్టు సభ్యులుగా అనుమానిస్తున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more