ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని అభియోగాలపై అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ తో రెండేళ్ల నుంచి జరిగిన వాట్సాఫ్ చాట్ ఆధారంగా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయ వర్తమాన నటి అనన్య పాండేను కూడా ఎన్సీబి అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండో రోజున అమె ఉదయం పదకొండు గంటలకు బదులుగా మధ్యాహ్నం రెండు గంటలకు రావడంతో అమెకు ఎన్సీబి అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారన్న విషయం తెలిసిందే.
కాగా అర్యన్ ఖాన్ తో జరిగిన చాట్ సంభాషణలో ఒక రోజు పార్టీకి అమెను కూడా రమ్మని అర్యన్ ఖాన్ అహ్వానించారు. అంతేకాదు.. పార్టీకి వస్తూ గంజాయిని కూడా తీసుకురావాలని కోరాడు. దీంతో దానికి అమె సరేనని.. తాను తీసుకువస్తానని చెప్పినట్టుగా చాట్ సంబాషణ సాగింది. దీంతో అర్యన్ ఖాన్ కు గంజాయిని అందించింది అనన్య పాండేనేనా అన్న కోణంలో ఇవాళ విచారణ సాగనుంది. ఈ క్రమంలో అనన్య తాను అర్యన్ ఖాన్ తో కేవలం జోక్ చేశానని చెప్పుకోచ్చింది. ఇక దీనిపై స్పందించిన ఎన్సీబి అధికారులు అనన్య గంజాయి సమకూర్చిందని ఆధారాలు లేవని తెలిపారు.
అయితే వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ కాల్ సంబాషణలను మరింత లోతుగా అధ్యయనం చేసిన ఎన్సీబి మరోమారు అనన్య పాండేకు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూన్నట్లు ఆ నోటీసులలో పేర్కోంది. అమె నుంచి మరిన్ని నిజాలను రాబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి రోజున గంట పాటు విచారణకు హాజరైన అమె కేవలం ఏడుస్తూనే ఉండిపోయిందని.. ఇక రెండో రోజున నాలుగు గంటల విచారణలోనూ అమె స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని.. దీంతోనే అమెను మరోమారు ఎన్సీబి అధికారులు విచారించనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more