దీర్ఘకాలిక రోగాలను కూడా చిటికలో తరిమేస్తానని, అవి రోగాలు కాదు.. మరోదే ప్రభావం చేత అలా జరుగుతుందని మాయమాటలు చెప్పి ప్రజల అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని డబ్బును లాగేయడం అలవాటైన భైతవైద్యులు గురించి మనకు తెలిసిందే. అయితే డబ్బులు ఆర్జించడంతోనే వీరి ఆశలకు కళ్లాలు పడటం లేదు.. మరో అడుగుముందుకేసి.. తమ వద్దకు వచ్చే వారిపై అకృత్యాలకు తెగబడటం కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన అమాయక మహిళ ప్రాణాలను బలిగోన్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఓ భూతవైద్యుడిని శిక్షించిన గ్రామస్థులు రాష్ట్రంలోని భూతవైద్యులందరికీ గుణపాఠం చెప్పారు.
చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళపై కన్నేసిన భూతవైద్యుడు అమెను ఆదివారం రోజు సాయంత్రం ఇంటికి పిలిపించాడు. చికిత్సలో భాగంగా అమెను పిలిచిన ఆయన అమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు గట్టిగా అరచింది. దీంతో ఓ పదునైన వస్తువుతో అమెపై తెగబడిన భూతవైద్యుడు అమె గొంతు కోసి చంపేశాడు. తన ఇంటి నుంచి బయటకు కంగారుగా వచ్చిన ఆయనను చూసిన గ్రామస్థులు.. విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో ఊగిపోయి అతడ్ని కర్రెలు, రాడ్లతో దారుణంగా కొట్టడంతో భూతవైద్యుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో అడ్డుకున్న పోలీసులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దీర్ఘకాలంగా.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ స్థానిక భూత వైద్యుడైన వల్లెపు ఓబయ్య (60) వద్ద గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటోంది. మందులు ఇస్తానంటూ ఆమెను ఇంటికి పిలిచిన నాటు వైద్యుడు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పదునైన కత్తితో ఆమె గొంతుకోశాడు. ఆ సమయంలో ఆమె పెద్దగా కేకలు వేసినా.. చికిత్సలో భాగంగా అరుస్తోందని అనుకున్న ఇరుగు పొరుగువారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి కంగారుగా తిరుగుతున్న ఓబయ్యను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు, భర్త, కుమారులు పోలీసుల అదుపులో ఉన్న ఓబయ్యపై దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఒక్కసారిగా దాడిచేయడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. దీంతో అదనపు బలగాల కోసం ఫోన్ చేశారు. అయితే, అవి వచ్చేలోపే ఓబయ్యను గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపేశారు. ఇది చూసిన ఎస్ఐ రజియా సుల్తానా కళ్లుతిరిగి పడిపోయారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్ అదనపు బలగాలతో గ్రామానికి చేరుకునే సరికే ఓబయ్య హతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more