వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కబడ్డీ ఆడారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కాళీమాత దేవాలయం వద్ద ఆమె విద్యార్థులతో కలసి ఈ ఆట ఆడారు. దసరా సందర్భంగా మొదట గుడిలో పూజల్లో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్ అనంతరం గుడి వద్ద మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడాన్ని చూశారు. ప్రజ్ఞాను కూడా ఆడాలని అమ్మాయిలూ కోరారు. దీంతో ఆమె కబడ్డీ.. కబడ్డీ అంటూ కూత పెడుతూ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరిగ్గా ఇంతకు ముందు రోజునే అమె నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమె గార్బా నృత్యాన్ని కూడా చేశారు. ఆ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.
కాగా 2007 మాలెగావ్ పేలుళ్ల కేసులో విచారణను ఎదుర్కోంటున్న ఆమె.. తనకు దీర్ఘఅనారోగ్య సమస్యలు వున్నాయని, వాటి నేపథ్యంలో తాను వైద్య పరీక్షలు చేయించుకుం టున్నానని న్యాయస్థానానికి విన్నవించి బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా అటు గార్బా, ఇటు కబడ్డీ ఆటలలో ఎలాంటి అనారోగ్య సమస్యలు అమెను వేదిస్తున్నట్లు కనిపించలేదని, అమెకు బెయిల్ ఎందుకు ఇచ్చారని నెటిజనులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. న్యాయస్థానాల్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పే నేతలు.. వీదుల్లో మాత్రం ఆటలు, డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నా.. న్యాయస్థానానికి పట్టదా అని కామెంట్లు చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో సానుభూతి ఓట్ల కోసం వీల్ చెయిర్ లో తిరిగిన నేతలు.. గెలిచిన తరువాత మాత్రం డాన్సులు, కబడ్డీ ఆటలు ఎలా అడుతున్నారో చూడండీ అంటూ నెటిజులు నెట్టింట్లో, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక అమె కబడ్డీ అడిన వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఆమెను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో వ్యక్తిగత విచారణ నుంచి అనారోగ్య సమస్యలు అని చెప్పిన బెయిల్ తెచ్చుకున్న బీజేపి ఎంపీ.. ఆటలు, డాన్సులు చేయడానికి మాత్రం ఎలాంటి సమస్యలు లేవని నిరూపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందు ఆమె విచారణకు మళ్లీ ఎప్పుడు హాజరు కావాల్సి ఉందని ప్రశ్నించారు.
इनकी NIA कोर्ट में अगली 'पेशी' कब है? pic.twitter.com/PddYsXzGP3
— Srinivas BV (@srinivasiyc) October 13, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more