ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కుతూ వెళ్లిన ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లఖీంపూర్ ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తమను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయని పేర్కోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర నిరాశను వ్యక్తపర్చింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసులు వెంటనే స్పందించకుండా, నిందితులను అదుపులోకి తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనలో పూర్తిగా చేతులెత్తేసిన పోలీసుల ఏం సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారని నిలదీసింది. ఈ కేసులో నిందితులపై 302 సెక్షన్ మోపబడింది. ఇది హత్యకు సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ పై నమోదయ్యే ఇతర కేసుల్లో వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో లఖింపూర్ కేసు నిందితులతోనూ అలాగే వ్యవహరించండి’ అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది.
లఖీంపూర్ ఖేరీ ఘఠనలో రైతుల మరణానికి కారణమయ్యారని తీవ్ర అరోపణలను ఎదుర్కోంటున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రాను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పోలీసులు గురువారం నోటీసులు అందించారు. అయితే ఇప్పటివరకు ఆయన పోలీసుల ఎదుట హాజరుకాలేదు. దీంతో పోలీసులు ఇవాళ మరోమారు ఆయనను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా అదేశిస్తూ మరోమరు అజయ్ మిశ్రా ఇంటికి నోటీసులు అతికించారు. ఇక ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వ న్యాయవాధి హరీశ్ సాల్వే.. రేపు కూడా అశీష్ మిశ్రా పోలీసుల ఎదుట హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వయ్ తొక్కుకుంటా వెళ్లడంతో నలుగురు రైతులు మరణించడంపై శివకుమార్ త్రిపాఠి అనే న్యాయవాది.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రాసిన లేఖ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఘటనను సుమోటాగా తీసుకుని విచారణ చేపట్టింది. ఇక లఖీంపూర్ ఘటనపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని వెల్లడించింది. ఆశిష్ మిశ్రా, మరికొందరికి లఖింపూర్ నరమేధంలో భాగం ఉందని, వీరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more