గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో విడుదలకు సిద్దమవుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాన్ భీమ్లా నాయక్ చిత్రంలోని డైలాగ్ ఘర్షణకు దారితీసింది. పెదనందిపాడు మండల పరిధిలోని కొప్పర్రులో టీడీపీ నేత, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిని శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేసి, ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెబుతున్నారు. వైసీపీ నేతల దౌర్జన్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడి నుంచి అందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా గతంలో హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరిగే విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం కొత్తగా రాజకీయ అల్లర్లు జరగడం కలకలం రేపుతోంది. అన్నివర్గాల ప్రజలు ఎంతో భక్తిపారవశ్యంతో జరుపుకుని అంతే భక్తిశ్రద్దలతో గణనాధుని గంగమ్మ ఒడికి చేర్చే నిమజ్జన ఉత్సవంలో పాల్గోంటారు. అయితే గుంటూరులోనూ అదే జరిగింది. గత రాత్రి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన గణనాధుడిని హంగామాఆర్భాటాల మధ్య నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే వారు వెళ్లే దారిలో వున్న టీడీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడి ఇళ్లు వుంది. అక్కడే అర్ధరాత్రి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన గణనాధుడి జడ్సీటీసీ సభ్యురాలు బత్తిన శారద ఇంటివద్దకు చేరుకోగానే వైసీపీ నేతలు చాలా సేపు అక్కడే డాన్సు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందినవారు పవన్ కల్యాన్ భీమ్లానాయక్ చిత్రంలోని డైలాగ్ చెప్పడంలో వైసీపీ కార్యకర్తలు వారిపై ఘర్షణకు దిగారు. అంతటితో ఆగనివారు ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు శారద ఇంటిపైకి దాడి దిగినట్టు సమాచారం. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని శారద ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more