ఉత్తర్ ప్రదేశ్ లోమహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార బీజేపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే సహా ఆయన సోదరుడు కూడా ఇలాంటి కేసుల్లో కటకటాలు లెక్కబెడుతున్నా.. అక్కడి పురుషాధిక్య సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి తోడు ఆడవారిపై విరుచుకుపడే తత్వం వారిని మరితంగా స్త్రీజాతిపై అఘాయిత్యాలకు తెగబడేలా చేస్తోంది. మహిళల వస్త్రాధారణ, రాత్రి పూట బయట సంచరించడంపై అంక్షలు ఇత్యాదులు కూడా అందుకు తోడవుతున్నాయి. తాజాగా ఎస్సీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడిపై కూడా ఇలాంటి కేసే నమోదైంది.
సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ కుమారుడు కవి అహ్మద్పై పోలీసులు లైంగిక దాడి, దోపిడీ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిందితుడు పేరు మార్చుకుని పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మహిళకు దగ్గరయ్యాడు. మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే భార్య, కూతురు కూడా తనను వేధింపులకు గురిచేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన తాను సివిల్లైన్స్లో జిమ్ నిర్వహిస్తున్నానని బాధితురాలు వివరించారు.
2018లో కవి అహ్మద్ తన పేరు మార్చుకుని తనతో స్నేహం చేశాడని, బ్యూటీపార్లర్ నడిపిద్దామని చెబుతూ తనను లక్నోకు తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లగానే మత్తుమందు ఇచ్చి తనను లైంగికంగా వేధించేవాడని, తన అభ్యంతరకర వీడియోలు తీసి వాటిని చూపుతూ బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించారు. తాను ప్రయాగ్ రాజ్ వెళ్లినా అక్కడకు వచ్చిన నిందితుడు తనను తుపాకీతో భయపెట్టి లైంగిక దాడికి పాల్పడి వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఇక ఆదివారం తాను సివిల్ లైన్స్కు వెళ్లగా నిందితుడు తన అనుచరుడితో అడ్డగించారని తెలిపింది.
అంతటితో ఆగకుండా తన అనుచరుడు తన గోల్డ్ చైన్ను దొంగిలించాడని, తన సిమ్ కార్డును లాక్కున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అహ్మద్పై లైంగిక దాడి, లూటీ ఆరోపణలపై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు. మరోవైపు బ్లూటీ పార్లర్ నడిపేందుకు ఇచ్చిన రూ ఆరు లక్షలు తిరిగి ఇవ్వాలని తన కుమారుడు కోరడంతోనే యువతి తప్పుడు కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్బలంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెచ్చారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more