బిజినెస్ టైకూన్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుంటూ తన హృదయానికి నచ్చిన వీడియోలను, ఫోటోలను అప్పడప్పుడు తన సంస్థ ప్రచారానాలను కూడా తన అభిమానులతో పాటు నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇలా ఆయన షేర్ చేసిన వీడియోలలో కొన్ని నవ్వించేవి, మరికోన్ని ఆలోచింపజేసేవి, ఇంకొన్ని వర్తమాన అంశాలు ఉంటాయి. అయితే ఆయన షేర్ చేసిన ఏ వీడియో అయినా.. ఫోటో అయినా వెనువెంటనే సంచలనంగా మారిపోతుంది.
ఆయన ఎప్పుడు ఏ వీడియోను షేర్ చేస్తారా.? అంటూ ఆయన ఫాలోవర్స్ వేచి చూస్తుంటారు. ఇది ఆయనకు షోషల్ మీడియాలో వున్న క్రేజ్. ఇలా వీడియోలు, ఫోటోలతో పాటు ఆయన అప్పుడప్పుడూ తమ సంస్థకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు సంబంధించి మార్కెటింగ్ కూడా వినూత్నంగా నిర్వహిస్తుంటారు. మహీంద్రా ఎక్స్యూవీ500 వాహనానికి సంబంధించిన ఓ ప్రకటనను గుర్తుకుతెచ్చేలా.. తాజాగా రోడ్డుపై పులులు సంచరిస్తున్న వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘రోడ్ల మీద మా ఎక్స్యూవీ వాహనాలే కాదు, పెద్దపులులు కూడా సంచరిస్తాయి.. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఈ వీడియోలో.. ఓ అభయారణ్యంలోని రెండు పులులు రోడ్డు పైకి వస్తాయి. అక్కడే కలియతిరుగుతాయి. వాటిని చూసిన వాహనదారులు రోడ్డుపైనే నిలిచిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఈ దృశ్యాలు ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. కాగా ఈ విషయమై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ వీడియోను ఈ మధ్యే మహాబలేశ్వరం-పంచ్గని రోడ్డుపై చిత్రీకరించారని కొందరు పేర్కొంటున్నారు. ఈ దృశ్యాలను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ సమీపంలో చిత్రీకరించారని కొందరు అంటున్నారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ జాతీయ పార్కులోని దృశ్యాలని మరికొందరు వెల్లడిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more