దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కులు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులు క్రమం తప్పకుండా వాష్ చేసుకోవాలని.. ఈ నిబంధనతోనే డెల్టా వేరియంట్ నుంచి తప్పించుకోగలమని నీతి ఆయోగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తున్న డెల్టా వేరియంట్ దేశంలోనూ విజృంభించే అవకాశాలు వున్నాయిని అరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని తేల్చిచెబుతున్నారు.
ఇప్పటికే పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభన కోనసాగుతోందని, భారత్ లోనూ కేసుల పెరుగుదలకు అవే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రపంచ అరోగ్య సంస్థ కూడా పరిగణిస్తోంది. దేశంలో మళ్లీ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత కొన్ని వారాలుగా చూస్తుంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కేసులు ఇండియాలో రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకేపాల్ మాట్లాడారు. కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు.
కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ఆంధప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కఠిన నిబంధనలు అమలు చేసి మూడో దశ రాకుండా అడ్డుకోవాలన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా విధానాన్ని మరింత విస్తరించాలని తెలిపారు. వైద్యరంగంలో మౌలికసదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్కు కరోనా ముప్పు తొలగలేదని అయితే.. వచ్చే మరో 100-125 రోజులు చాలా క్రిటికల్ అని కేంద్రం ప్రకటించింది.
థర్డ్ వేవ్ నుంచి పిల్లలు జాగ్రత్త..
పిల్లలు కరోనాబారిన పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీకాలతో 95శాతం మరణాల రేటు తగ్గిందని వీకే పాల్ తెలిపారు. రెండో వేవ్లో కరోనా మరణాలను తగ్గించడంలో టీకాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని అన్నారు. రెండు డోసులు వేసుకొన్నవారిలో మరణాల రేటు 95 శాతం తగ్గిందన్నారు. ఒక్క డోసు వేసుకొన్నవారిలో 82 శాతం ఉందన్నారు. గడిచిన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో మాత్రమే రోజుకు 100 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more