Nagaland devotees held for consuming liquor on Tirumala Hills తిరుమల సప్తగిరులపై అపచారం.. బట్టబయలైన భద్రతా డొల్లతనం

Questions raise on tirumala vigilence security check as nagaland devotees consumed liquor on hills

Nagaland People Found Drinking Alcohol on Thirumala Ghat Road, Nagaland People, Nagaland People Found Drinking Alcohol, People Found Drinking Alcohol, People Found Drinking Alcohol on Thirumala Ghat Road, Drinking Alcohol on Thirumala Ghat Road, Drinking Alcohol on Thirumala, Nagaland devotees, Tirumala Ghat Road, Consuming Liquor, Turumala vigilence, security check, Andhra Pradesh, crime

Tirumala vigilence Security check at srivari padam and the main entrance for the vehicles raise many questions as Nagaland devotees consumed liquor on Tirumala Ghat Road to Tirumala.

ITEMVIDEOS: తిరుమల సప్తగిరులపై అపచారం.. బట్టబయలైన భద్రతా డొల్లతనం

Posted: 07/14/2021 10:51 AM IST
Questions raise on tirumala vigilence security check as nagaland devotees consumed liquor on hills

కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. తిరుమల సప్తగిరులను కొందరు భక్తులు మొకాళ్లతో కూడా ఎక్కుతుంటారు. ఇక మరికోందరు భక్తులు ప్రతీ మెట్టుకు బొట్టు పెడుతూ అన్ని మెట్లపై శ్రీవెంకటేశ్వరుడే వున్నాడని భావిస్తుంటారు. అంతటి పవిత్రతతో కూడిన కొండలపై కొందరు భక్తులు మద్యం సేవిస్తూ కనిపిస్తే.. అదే దారిలో వెళ్లిన కొందరు శ్రీవారి భక్తులు రగిలిపోయారు. పవిత్రమై తిరుమల కోండలపై మహాపచారం చేస్తున్నారని వారు తిరుమల విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి మద్యం సేవిస్తున్న భక్తులను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల భద్రతా డొల్లతనం మరోమారు బట్టబయలైంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేసిన తరువాత కానీ లోనికి అనుమతించరు. అలాంటిది వారి తనిఖీలను పూర్తి చేసుకున్న తరువాత వాహనానికి అనుమతి ఎలా లభించిందని.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్ నుంచి బ్రీఫ్ కేస్ వరకు ప్రతి ఒక్కటీ తనిఖీ చేసే సిబ్బంది కారులోని మద్యం బాటిళ్లను ఎలా తనిఖీ చేయడం మర్చిపోయారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వాహనాల తనిఖీ కోసం పెద్ద సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, కాంట్రాక్టు సిబ్బంది విధి నిర్వహిస్తున్నా. వారిని దాటుకుని మద్యం బాటిల్ ఎలా వెళ్లగలిగిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దీంతో అలిపిరి వద్ద నిఘా వైఫల్యం, భద్రతా డోల్లతనం మరోమారు బట్టబయలైంది. నాగాలాండ్ కు చెందిన భక్తులు తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. మద్యం బాటిళ్లతో వారి కారు కొండపైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలిపిరి వద్ద తూతూమంత్రంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. తిరుమల కోండపై అనేక నిబంధనలు వున్నా.. వాటికన్నా అధికంగా భక్తుల నమ్మకాలతో ముడిపడిన అంశాన్ని నాగాలాండ్ భక్తులు ఎలా అతిక్రమించారన్నది మరో ప్రశ్న. మద్యం బాటిల్ తో పాటు వీరు కొండపైకి వెళ్లిన వ్యవహారం స్పెషల్ కేస్ గా మారింది. దీంతో ఇక్కడ విజిలెన్స్ అధికారుల వైఫల్యం కొట్టోచ్చినట్టు కనబడుతోందని భక్తులు మండిపడుతున్నారు.

అయితే మద్యం తాగుతూ పట్టుబడ్డ నాగాలాండ్ భక్తులు మాత్రం తాము తొలిసారిగా తిరుమత తిరుపతి దేవస్థానానికి విచ్చేసామని.. ఇక్కడి ఆచార వ్యవహారాలు తమకు తెలియదని చెప్పారు. దీంతోనే తాము కారులో మద్యం సేవించామని అన్నారు. ఇక విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న తరువాత వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కవుతున్నారు. అలిపిరి వద్ద తమను సరిగ్గా తనిఖీ చేసి, మద్యం బాటిల్‌ సీజ్ చేసి ఉంటే తాము ఈ పని చేసి ఉండేవారం కాదు కదా అంటూ సమర్ధించుకున్నారు. తమకు తిరుమల నిబంధనలు తెలియవని, పొరపాటు చేశామన్నారు. అలిపిరి వద్ద తనిఖీలు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles