petrol price at Rs 99.86 per litre in Delhi మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. చెన్నైలో రూ.100ను అధిగమించి..

Petrol price hike once again crosses rs 100 per litre in 13 states

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Fuel prices continued an upward march on Monday with the price of petrol in Delhi inching closer to the three-figure mark. While petrol was priced at Rs 99.86 per litre in Delhi after 35 paise hike, people in the national capital have to shell out Rs 89.36 (unchanged today) for one litre of diesel.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. దేశ రాజధాని సహా 13 రాష్ట్రాల్లో రూ.100 ధాటిన ధర..

Posted: 07/05/2021 01:03 PM IST
Petrol price hike once again crosses rs 100 per litre in 13 states

ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలులో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరుకుంది. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధరల 100 రూపాయలకు చేరుకుంది. దీంతో పాటు దాదాపుగా దేశంలోని 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100ను మించి పరుగులు పెడుతొంది. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. అంతర్జాతీయంగా పెద్దగా ధరల ప్రభావం లేకపోయినా దేశంలో మాత్రం ఇంధన ధరలకు అదనపు పన్నులు తోడవ్వంతో ధరలు భగ్గమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్‌ పెరగ్గా.. మూడేళ్ల గరిష్ఠానికి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76.09 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరను మాత్రం యధాతధంగా కోనసాగిస్తున్నాయి. మే 4 నుంచి నెలలో ఇప్పటివరకు చమురు ధరను 35 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.8.35, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.105 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 99.86గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.36కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.105.92గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.96.91కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.100.75గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.91కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.99.84గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.92.27కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ..106.07 కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.26కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.103.50గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.60కు చేరింది.
భోపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.16గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.98.13కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.103.20గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.94.72కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.01గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.94.76కు చేరింది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.96.03గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.99గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.75కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.101.49గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.93కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles