నదులు, కాలువల్లో ఉండే మొసళ్లు చెరువుల్లోకి వస్తేనే భయపడిపోతాం. అటు వైపు వెళ్లడానికి కూడా సాహసం చేయం. ఎంతటి ధైర్యవంతులైనా మొసలి వుందంటేనే ఆ పనులు మానుకుంటారు. ఎందుకంటే అవి అంత డేంజర్. చూడటానికే భయంకరంగా వుండే మొసళ్లు.. విహారయాత్రకు వచ్చినట్లుగా జనారణ్యంలోకి వస్తే.. ఇంకేమైనా వుందా.? దానిని చూసిన వెంటనే గుండెలదిరిపోతాయ్. కానీ ఇక్కడ అదే జరిగింది. ఏకంగా మొసలి ఊర్లోకే వచ్చేసి.. తనను ఎవరూ పట్టించుకోలేదని అరిచేసింది.
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర్ కర్ణాటక ప్రాంతంలోని ధనధెల్లి జిల్లా పరిధిలోని కోగిల్బాన్ గ్రామంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. కొంత దూరం నడిచిన మొసలి ఆ తరువాత అలసిందో లేక తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుందో లేక అది వెతుకున్నది లభించడం లేదని, లేక నది నుంచి దారి తప్పి ఎటు వచ్చాన్రో దేవుడా.. అని అవేదన చెందిందో తెలియదు కానీ నడక ఆపేసి అరిచేసింది. దీంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లను మూసేసుకోవడంతో ఆ కాలనీ అంతా నిర్మానుష్యంగా మారింది.
భారీ ఆకారంలోని మొసలి రోడ్డుపై నడుస్తూ ఉండే అందరూ భయపడిపోయారు. ఇళ్ల తలుపులు మూసుకోవడం తప్ప మరేమి చేయలేకపోయారు. అయితే కొందరు మాత్రం కొంత ధైర్యం చేసి మొసలి కంట పడకుండా దానిని వీడియోను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఇక వెంటనే ఆ వీడియోలను స్థానిక అటవీశాఖ అధికారులకు పంపించారు. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి సమీపంలోని కాళీ నదిలో వదిలేశారు. అయితే ఆ తరువాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడా వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.
#WATCH Karnataka | A crocodile found strolling through Kogilban village in Dandeli. Later, forest officials rescued the crocodile & released it into the river. pic.twitter.com/2DDk7JuOB8
— ANI (@ANI) July 1, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more