ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక తరం ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలోని బీసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులో డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. బిసి, ఎస్సీ వర్గాలకు ఉద్యోగాలు లభిస్తాయన్న తెలిసి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని.. దీంతో ప్రభుత్వం మాట్లల్లో చూపించే ప్రేమ ఒకటి.. చేతల్లో మరోటి చేస్తుందని తేలిపోయిందని అన్నారు.
కరోనా వల్ల పేదల జీవితాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రాష్ట్ర ప్రజలను ఓ వైపసు కరోనా మరోవైపు కేసీఆర్ వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారానికి దూరమౌతేనే అన్ని సమస్యలు పోతాయని అన్నారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్ కూడా భస్మాసురుడి లాంటివారేనని ఆయన విమర్శించారు. ఆయన కూడా తన తలపై తానే చెయి పెట్టుకునే తరహాలోనే ఆయన గత ఉద్యమ నేపథ్యమంతా సాగిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దు చేస్తారో తెలియదని అన్నారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని . కేసీఆర్ ఈ మధ్యే బయటకు వస్తున్నారు. ఏడేళ్లుగా దళితులపై దాడులు, అక్రమ అరెస్టులను పట్టించుకోలేదు. దళిత సాధికారత సమావేశాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు బడ్జెట్లో కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా రావాల్సిన నిధులు కూడా రావడం లేదు’’ అని రేవంత్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more