Petrol, diesel prices at all-time high after fresh hike మళ్లీ పెరిగి రికార్డు స్థాయికి చేరిన ఇంధన దరలు..

Fuel prices touch fresh record highs diesel too nears rs 100 litre mark in rajasthan

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices have hit an all-time high after state-run oil companies revised rates on Monday. Petrol price is inching closer to Rs 96.41 per litre in Delhi and Mumbaikars will soon pay Rs 102.58 per litre for the essential fuel. Petrol price has been increased by roughly 29 paise per litre while diesel has become dearer by 30 paise.

మళ్లీ పెరిగి రికార్డు స్థాయికి చేరిన ఇంధన దరలు..

Posted: 06/14/2021 12:26 PM IST
Fuel prices touch fresh record highs diesel too nears rs 100 litre mark in rajasthan

ఇంధన ధరల విషయంలో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చెప్పారు. ఈ ఇటీవల జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా అవి నీటిమూటలేనని తేలిపోయాయి. ఇక ఇటు ఇంధన ధరలు మాత్రం గత డెబై ఏళ్లలో ఎప్పుడూ లేని గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డును నమోదు చేస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత (మే 4) రోజు నుంచి క్రమంగా ఇంథన దరలను పెంచూతూ వస్తోన్న కేంద్రం.. ఇప్పటి వరకు ఏకంగా 24 సార్లు ధరలను పెంచి దేశంలోని అనేక చోట్ల ధరలు వందకు పైగానే చేరుకునేలా చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16 సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, ఇక జూన్ నెలో తాజా పెంపుతో ఎనమిది సార్లు ఇంధన ధరలు పెంచాయి. గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది.

ఫలితంగా పలు రాష్ట్రాలలో ఇంధన ధరలు రూ. 100 మార్కును అధిగమించాయి. పెరిగిన ధరలతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సహా లేహ్ ప్రాంతంలోనూ లీటరు పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయల మార్కును దాటింది. దేశంలోనే రాజస్థాన్ గంగానగర్ లో అత్యధికంగా పెట్రోల్ ధర లీటర్ రూ. 107.53కు చేరుకుంది. కాగా డీజిల్ ధర రూ.100.37కు చేరుకుంది. అటు మహారాష్ట్రలో తాజా పెంపుతో రూ.102,56 వరకు లీటరు పెట్రోల్ కు చేరుకుంది. ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 30 పైసల వరకూ పెంచాయి. మే నెల నుంచి ఇప్పటివరకు చమురు ధరను మొత్తంగా 24 సార్లు పెంచిన సంస్థలు మే నెల నుంచి క్రమంలో పెట్రోల్ పై ఏకంగా రూ.5.85, డీజిల్ పై రూ.6.31 వరకు పెంచాయి చమురు సంస్థలు. దీంతో దేశీయంగా పెట్రోల్-డీజిల్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతూ సెంచరీ మార్కును దాటేసి పైకి ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 96.34గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 87.28కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 102.58గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.70కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 97.69గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.92కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 96.34గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 90.12కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 102.79 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.99కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 101.05గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.41కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 100.20గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.14కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles