ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16 సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, ఇక జూన్ నెలో తాజా పెంపుతో రెండు సార్లు ఇంధన ధరలు పెంచాయి. గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది.
ఫలితంగా పలు రాష్ట్రాలలో ఇంధన ధరలు రూ. 100 మార్కును అధిగమించాయి. పెరిగిన ధరలతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సహా లేహ్ ప్రాంతంలోనూ లీటరు పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయల మర్కాును దాటింది. అటు మహారాష్ట్రలో తాజా పెంపుతో రూ.101 వరకు లీటరు పెట్రోల్ కు చేరుకుంది. అంతర్జాతీయంగా పెద్దగా ధరల ప్రభావం లేకపోయినా దేశంలో మాత్రం ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.
ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 27 పైసలు, డీజిల్ లీటర్కు 28 పైసల వరకూ పెంచాయి. మే నెల నుంచి ఇప్పటివరకు చమురు ధరను మొత్తంగా 18 సార్లు పెంచిన సంస్థలు మే నెల నుంచి క్రమంలో పెట్రోల్ పై ఏకంగా రూ.4.36, డీజిల్ పై రూ.4.93 వరకు పెంచాయి చమురు సంస్థలు. దీంతో దేశీయంగా పెట్రోల్-డీజిల్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతూ సెంచరీ మార్కును దాటేసి పైకి ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటింది.
తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 94.76గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 85.66కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 100.98గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 92.99కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 96.23గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 90.38కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 94.76గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 88.51కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 100.89 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.96కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 99.42గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.08కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 98.48గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 93.08కు చేరింది.
దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఏకంగా వంద మార్కును దాటి మరో ఐదు రూపాయల మేర ధర చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more